ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పటివి కావు! 1956వ సంవత్సరంలో తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో కలిసినప్పటికీ నుంచి విభజన అయిన తర్వాత నేటి వరకు కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక విషయంపై యుద్ధం జరుగుతూనే వుంటోంది. నిన్నమొన్నటివరకు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదోపవాదనలు చేసుకున్న అనంతరం... గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ సీఎంలు అధికారికంగా కలుసుకుని తమతమ సమస్యలను విశ్లేషించుకున్నారు. అందులో భాగంగానే వారిమధ్య ఇక ఘర్షణలు తలెత్తే సమస్యే లేదని... రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్యైనా తలెత్తితే దాన్ని కలిసి పరిష్కరిస్తామని ప్రకటించేసుకున్నారు. దీంతో రెండురాష్ట్రాల మధ్య వున్న విభేదాలు పూర్తిగా సమసిపోయాయనుకున్న తరుణంలో... తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.
తాజా పరిణామాల ప్రకారం చూస్తుంటే... కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రారాష్ట్ర బీసీ కులస్తుల మీద పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రరాష్ట్రం నుంచి తెలంగాణాలో మకాం మార్చుకున్న ఆంధ్ర బీసీ ప్రజల మీద కేసీఆర్ వేటు వేస్తున్నారు. (ఆంధ్రరాష్ట్రానికి సంబంధించి చాలామంది ప్రజలు తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సెటిల్ అయినవారున్నారు!) ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారి మీద వేటు వేస్తూ ఒక తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆంధ్రా రాష్ట్రం నుంచి వచ్చిన కొప్పుల, వెలమ, కళింగ, శెట్టి బలిజ, నగరలు, గవర, కాపు, తూర్పు కాపు వంటి తదితర కులాలతోపాటు మరో 19 కులాలకు చెందిన ప్రజలందరూ సాధారణంగా బీసీ క్యాస్ట్ కిందకు వస్తారు. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణాలో వున్న బీసీలందరూ ఓసీ కిందకు పరిగణించబడతారు.
పైన చెప్పిన విధంగా రకరకాల కులాలకు చెందిన ప్రజలు ఎవరైతే తెలంగాణాలో వున్నారో.. ఇప్పటినుంచి వారు ఓసీ కేటగిరి కిందకు పరిగణించబడతారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్ సందర్భంగా రిజర్వేషన్ కోటాలో అడ్మిషన్స్ లో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రా బీసీ అసోసియేషన్ సభ్యులందరూ దీనిమీద నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయంపై ఆంధ్రా ప్రభుత్వంతోపాటు బీసీ అసోసియేషన్ సభ్యులందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉద్యమాలు చేపడ్డానికి రంగం సిద్ధం చేస్తున్నాయని సమాచారం! మరి ఈ వివాదం ఇంకెంత దుమారాన్ని రేపుతుందో..? ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించనుందో..? వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more