నిన్నామొన్నటివరకు తన ఆఫీస్ లో ఏసీ కింద ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని... అధికారాలకు ఆర్డర్లు ఇస్తూ సుఖంగా కాలాన్ని గడిపిన ఒక జిల్లా కలెక్టర్... నేడు ఏమయిందో ఏమో తెలీదు కానీ వున్నట్లుండి రోజువారి కూలీగా మారిపోయారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఒకేసారి గ్రామకూలీ స్థాయికి చేరిపోయారు. ప్రస్తుతం ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారిపోయింది. జిల్లా కలెక్టర్ కూలీగా ఎలా మారిపోయారు..? ఏం జరిగింది..? ఆ కలెక్టర్ ఎవరు..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఆ కలెక్టర్ మరెవ్వరో కాదు.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న నీతూ ప్రసాద్.
అసలు విషయం ఏమిటంటే.. ప్రజల కష్టనష్టాలు కేవలం వినడం మాత్రమే కాకుండా... వారితో మమేకమై వారి జీవనసరళిని, విధానాలను దగ్గరగా గమనించడానికి ఆమె ఇలా కూలీగా అవతారమెత్తాల్సి వచ్చింది. ప్రజలతో కలిసిపోయి కొత్తపద్ధతులకు నాంది పలుకుతూ ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలతో కలిసివుంటూ, వారు చేస్తున్న పనుల్లో మనం కూడా కొంచెం పాలుపంచుకుంటే వారి జీవన విధానాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చుననే అభిప్రాయంతోనే ఆమె రైతుల దైనందిన జీవితాల్లోకి చేరి.. వారిలాగే రైతులా మారిపోయారు. ఒక జిల్లా కలెక్టర్ అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా ప్రజల బాధలను, కష్టనష్టాలను తెలుసుకోవడానికి ఇలా రైతుగా మారి వారితో కలిసిపోయారు.
కలెక్టర్ నీతూ ప్రసాద్ తాను వెళ్తున్న మార్గమధ్యంలో ఒక చోట నాట్లు వేస్తున్న రైతులను చూసి వెంటనే కారు నిలబెట్టారు. వెంటనే కారులోంచి దిగి.. రైతులతో కలిసి నాట్లు వేశారు. దీంతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా షాక్ కు గురై.. సాక్షాత్తూ కలెక్టర్ తమతో కలిసి నాట్లు వేయడాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ బాధలను వారు కలెక్టర్ తో పంచుకున్నారు. ప్రజలను కలవడానికి, వారి కష్టనష్టాలు తెలుసుకోవడానికి ఇదొక చాలా సులభమైన విధానమని నీతూప్రసాద్ పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more