ప్రదాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీస్ ప్రణాళికలో ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు, తెనాలి, నెల్లూరు మొదలైన పట్టణాలు స్మార్ట్ గా రూపొందవచ్చు. వీటితో పాటు మరెన్నో పట్టణాలు అభివృద్ధయ్యే అవకాశం విశాఖపట్నం, చెన్నై కారిడార్ వలన కలుగబోతోంది.
“పూర్వకాలం నదీతీరాల్లో నగరాలను నిర్మించేవారు. అలాంటిది ఇప్పుడు రహదారుల వెంట వెలుస్తున్నాయి. ఇక ముందు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ లభించే చోట, కొత్త తరం ఇన్ప్రాస్ట్రక్చర్ ఉన్నచోట అభివృద్ధి చెందుతా” యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మార్ట్ సిటీ ల గురించి జూన్ లో చేసిన ప్రసంగంలో అన్నారు. దేశం మొత్తం మీద 100 స్మార్ట్ సిటీస్ ని నిర్మించాలన్నది మోదీ ఆశయం.
కింది వీడియోలో దక్షిణ గుజరాత్ లో ఢోలెరా అనే స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందన్నిది ప్రెజెంట్ చెయ్యటం జరిగింది. ఇలాంటివి దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలు నిర్మించాలన్నది మోదీ యోజన.
{youtube}jOFpWFLSqgU|620|400|1{/youtube}
ఏమిటి స్మార్ట్ సిటీ అంటే?
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టివిలు వచ్చాయి కాబట్టి స్మార్ట్ సిటీలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఫోన్లు చేసే పనికంటే ఎక్కువ సాంకేతిక నైపుణ్యంతో పనిచేసేవే స్మార్ట్ ఫోన్లు. మామూలుగా టివిలో ఛానెల్స్ చూసేదానికంటే ఇంకా ఎన్నో విధాలుగా వాడుకునేదే స్మార్ట్ టివి. అలాగే పట్టణాలు, నగరాలలో మామూలుగా ప్రభుత్వం కలిగించే మంచినీరు, మురికి నీరు, చెత్త తీసేసే పని, రోడ్లు, వీధి లైట్లు ఇలాంటి నగరసౌకర్యాలే కాకుండా వాటిలో ఉండే ఇబ్బందులను పరిష్కరించే సాంకేతికాభివృద్ధి ఉన్న నగరవాసాలు ఈ స్మార్ట్ సిటీలు.
సెన్సార్స్ సాయంతో ఎప్పటికప్పుడు నగరవాసులు ఉపయోగించే నీటి మట్టం ఎంత ఉంది, వినియోగిస్తున్న విద్యుత్ ఏ ప్రమాణంలో ఉంది, ఎక్కడికక్కడ సెక్యూరిటీ కెమేరాలలో రికార్డ్ అవుతున్నవి, ఇవన్నీ ఆటోమేటిక్ గా సంబంధిత అధికారులకు చేరటం, ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నగరవాసులకు సూచనలివ్వటం, రోడ్ల మీద గుంతల్లాంటివి ఉంటే దాని సమాచారం, చెత్తా చెదారాన్ని ఆటోమేటిక్ గా క్లియర్ చెయ్యటం లాంటి ఎంతో సాంకేతికాభివృద్ధి ఉన్న నగరాలన్నమాట, ఉన్న నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చవచ్చు, లేదా మొదటి నుంచి నగరాన్ని నిర్మించవచ్చు.
మన దేశంలో స్మార్ట్ సిటీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఢిల్లీ రాజకీయంగా కేంద్రమైతే ముంబై వ్యాపార రీత్యా కేంద్ర స్థానం. ఈ రెండిటినీ కలుపుతూ ఢిల్లీ ముంబై కారిడార్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న మధ్యతరగతి నగరవాసులకు ఈ స్మార్ట్ సిటీలు ఎక్కువగా సౌకర్యాలను కలిగించి సౌకర్యవంతం, వేగవంతమైన జీవన విధానానికి దోహదం చేస్తాయి.
స్మార్ట్ సిటీ ఖర్చెంత
మోదీ కలలుగనే స్మార్ట్ సిటీలను నిర్మించటానికి అయ్యే ఖర్చు 6 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతున్న పని. దీన్ని స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఎస్ఐఆర్) అని పిలుస్తాం. స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్ (ఎసిఇజెడ్) లో ప్రభుత్వం భూములనిచ్చి ప్రైవేట్ వ్యాపార సంస్థలు అందులో పరిశ్రమలను పెంపొందించేట్టుగా వెసులుబాటు కలిగించినట్లు గానే, ఈ ఎస్ఐఆర్ లో వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. ఈ కారిడార్లలో పన్నులలో రాయితీలు, కొన్ని నియమాలను సడలించటం ద్వారా పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అందుకు వెసులుబాటుంటుంది.
ఎస్ఐఆర్ కారిడార్లలో ఒక స్మార్ట్ సిటీ నిర్మాణానికి సింగపూర్ ముందుకొస్తోంది. యుకె కంపెనీలను ప్రోత్సహించటానికి బ్రిటిష్ ఛాన్సెలర్ జార్జ్ ఓస్బార్న్ ఒక బిలియన్ పౌండ్ల వరకు ఋణాన్ని మంజూరు చేస్తామన్నారు. 100 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మాణం జరిగే ఢిల్లీ ముంబై కారిడార్ అభివృద్ధి పనిలో జపాన్ 26 శాతం పెట్టుబడి పెడుతోంది.
స్మార్ట్ సిటీల వలన, ప్రత్యేక కారిడార్ ల వలన ఆంధ్రప్రదేశ్ కి కలిగే ప్రయోజనమేమిటి
విశాఖపట్నం నుంచి చెన్నై వరకు అభివృద్ధి చేస్తున్న కారిడార్ లో విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ (డైవర్షన్), ఏలూరు, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతం (విజిటిఎమ్), ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
ఈ కారిడార్ లో భాగస్వామ్యానికి సింగపూర్ లాంటి దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ కారిడార్ పూర్తయినట్లయితే రవాణా వ్యవస్థ పెరుగుతుంది. రోడ్డు ద్వారా, రైలు ద్వారా, సముద్రం ద్వారా జరిగే రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కాకినాడ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఉత్పాదనలు చాలా సులభంగా గమ్యస్థానాలకు చేర్చటానికి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాకినాడ రేవు నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకు నిర్మించిన బకింగ్ హామ్ కెనాల్ ఏ ప్రయోజనాన్ని ఆశించి నిర్మించారో అది నెరవేరలేదు కానీ ఇప్పుడు అది కూడా పునరుద్ధరించబడవచ్చు.
పై వీడియోలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో చూసిన తర్వాత ఆ విధమైన సిటీలు ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ రూపంలోకి రావటానికి సమయం పట్టవచ్చు కానీ తప్పక వస్తుంది. ఈ తర్వాతి తరంవారైనా దాన్ని చూస్తారు. హైద్రాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి పోగొట్టుకున్నామే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ బాధపడాల్సిన పనే ఉండదు. దానికి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన నగరాలు ఆ రాష్ట్రం వాళ్ళకి లభించబోతున్నాయి కనుక. హైద్రాబాద్ ప్రాంతంలో జమీందారీ వ్యవస్థ నడిచినంత కాలం ప్రజలకోసం అభివృద్ధి కార్యక్రమాలేమీ జరగలేదు.
ఇంకా ఎన్ని సర్ కారిడార్లు
ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాస్వామ్యం, నడుపుతున్నది దూరదృష్టి, ధృఢ సంకల్పం, పట్టుదల ఉన్న ప్రధాన మంత్రి మోదీ కనుక ఢిల్లీ ముంబై లాగానే విశాఖ చెన్నై కారిడార్ పనులు కూడా రూపు దిద్దుకోబోతున్నాయి. అలాగే చెన్నై బెంగళూరు ఐటి కారిడార్ కూడా ప్రణాళికలో ఉంది. ఇక విశాఖపట్నం, కోలకతా కారిడార్ మిగిలి వుంది. కోలకతా నుండి ఈశాన్యదేశాలకు ఇటువంటి కారిడార్ నిర్మాణం ఇప్పట్లో కష్టమైన పనే- అంతా కొండప్రాంతం కనుక. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ, ఓడ రేవులను అభివృద్ధి చేస్తూ, స్మార్ట్ సిటీలను నిర్మిస్తూ, తద్వారా సాంకేతికాభివృద్ధితో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నది మోదీ ఆలోచన.
భారత ప్రభుత్వం చేపట్టిన 100 స్మార్ట్ సిటీలలో కొన్ని ప్రస్తుతమున్న సిటీలలో మార్పులు, కొన్ని కొత్త నగరాల నిర్మాణాలు జరుగుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
స్మార్ట్ సిటీ డిజైన్లు
ముందుగా మోదీ మొదలుపెట్టిన స్మార్ట్ సిటీ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గుజరాత్ రాజధానికి కేవలం కొన్ని మైళ్ళ దూరంలోనే వెలుస్తోంది. షాంఘై పర్యటనలో చైనా లో భవనాలను చూసిన తర్వాత ఇందులో కృత్రిమంగా తయారు చేసిన దీవిలో 80 అంతస్తుల డైమండ్ టవర్ కి ప్రణాళిక వెయ్యటం జరుగుతోంది.
గుజరాత్ రాష్ట్రంలోనే ఇంతవరకు ఎత్తైన 28 అంతస్తుల టవర్స్ నిర్మాణం ఇప్పటికే జరిగింది.
ఈ నగరంలో సోలార్ పేనల్స్, ఆటోమేటిక్ గా చెత్త సేకరించే యంత్రాంగం, వాటర్ ట్రీట్ మెంట్, రిసైక్లింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సిటీలోని ట్రాఫిక్ పరిస్థితి ఎప్పిటికప్పుడు టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా తెలియజేయటమే కాక సిటీ రోడ్ల మీద వాళ్ళు ఎటువైపు వెళ్ళాలన్నదానికి సూచనలు ఇవ్వ బడతాయి. ఈ ప్రాజెక్ట్ మొదటి విడత నిర్మాణం వచ్చే సంవత్సరానికి పూర్తవుతుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తవటానికి 2020 వరకు పట్టవచ్చని అంచనా.
మొదట్లో ఈ సిటీలోకి వచ్చే సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండి ఆదాయం తక్కువగానే ఉన్నా రానురాను అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న కొద్దీ అధిక సంఖ్యలో సంస్థలు ఇందులోకి వస్తున్నాయి. ముఖ్యమైన విషయం ఇందులో అంతర్జాతీయ బ్యాంక్ లు విదేశీ కరెన్సీతో లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉండటం. ఇది దేశంలో మరెక్కడా లేదు. ఈ స్మార్ట్ సిటీలను నిర్వహించటం మిగిలిన ప్రాంతాలకంటే చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుందని ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రమాకాంత్ ఝా అన్నారు.
దీని తర్వాతది ఢోలేరా స్మార్ట్ సిటీ. ఇది దక్షిణ గుజరాత్ లో 920 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో నిర్మించబడుతోంది. 2040 లో పూర్తయ్యేటప్పటికి ఈ నగరంలో 2 మిలియన్ నగరవాసులు ఇందులో ఉంటారని అంచనా వెయ్యవచ్చునని అన్నారు ఝా. దీనిలో జరిగే నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉంటుందన్నారాయన. ఇందులో గోల్ఫ్ కోర్స్, సోలార్ పేనల్స్, విమానాశ్రయం, వాటర్ ఫ్రంట్ లు స్పేస్ ఏజ్ డిజైన్లలో నిర్మించబడతాయని ఝా తెలియజేసారు. ఎస్ఐఆర్ లో ఢోలెరా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికవవచ్చు ఇదంతా
గుజరాత్ లోనే అంతకాలం పడితే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికిదంతా అవుతుంది అంటే అప్పటికి తరాలు మారిపోతాయి. అప్పుడూ చంద్రబాబు నాయుడు మనవడూ, జగన్ కుమారుడు పోటీలు పడుతుండవచ్చు. లేదా పవన్ కళ్యాణ్ జనసేన అధికారంలోకి రావొచ్చు. మరేదైనా పార్టీ, నాయకుడు తలెత్తవచ్చు. ఏమీ చెప్పలేం.
కానీ ఒకటి మాత్రం సత్యం. విత్తనం వెయ్యగానే వృక్షమవదు. మనం వేసిన విత్తనాల బాపతు ఫలాలు మనమే అనుభవించాలి అంటే సాధ్యం కాకపోవచ్చు. ఎప్పుడో నాటిన వృక్షాల నీడ మనకి దక్కినట్లే ఇప్పడు వేసిన ప్రణాళికతో జరిగే నిర్మాణం ఎప్పటికి పూర్తయినా వాటిని అనుభవించేది మన భావి సంతతే.
గుజరాత్ లోని ఢోలెరా స్మార్ట్ సిటీ 2040 కి పూర్తవుతుందంటే ఆంధ్రప్రదేశ్ కి మరో 10 సంవత్సరాలు కలుపుకోవచ్చు పూర్తి చెయ్యటానికి. అయితే మొదటి విడత తర్వాత నుంచే ఉపయోగంలోకి వస్తాయి కాబట్టి ఇప్పుడున్నవాళ్ళల్లో కొంతమందైనా దాని స్వరూపాన్ని చూసే అవకాశం ఉంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more