ఐప్యాడ్, ల్యాప్ టాప్ లను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు జాగ్రత్త, చర్మవ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ప్రముఖ కంపెనీ ఉత్పాదనల వలన ఏమీ కాదన్న ధీమాతో ఉండకండి. ఆపిల్ ఐ ప్యాడ్ వాడకంతో చర్మం మీద ఎలర్జీ వచ్చిన ఉదంతం శాన్ డియిగో హాస్పిటల్ లో సోమవారం వెలుగుచూసింది.
యాపిల్ ఐ ప్యాడ్ వాడుతున్న 11 సంవత్సరాల బాలుడు హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకోవలసివచ్చింది. వైద్యం చేసిన డాక్టర్లు ఆ అబ్బాయి మీద వచ్చిన చర్మపు దద్దులు ఐప్యాడ్ వాడకం వలనేనని తేల్చారు.
ఐప్యాడ్, కంప్యూటర్లలాంటి వస్తువులలో వాడే నికెల్ ఎలర్జీని కలుగజేసే లోహాలలో ఒకటి. నికెల్ వలన వచ్చే ఎలర్జీ ప్రాణాంతకమైతే కాదు కానీ చాలా అసౌకర్యం కలిగిస్తుందని డాక్టర్ షారన్ జాకోబ్ అన్నారు. వైద్య పరీక్షలు, చికిత్స తర్వాత ఆ హాస్పిటల్ లో తయారు చేసిన నివేదికను తయారుచెయ్యటంలో డాక్టర్ జాకోబ్ కూడా పనిచేసారు. మామూలుగా అలర్జీలలో దద్దులు లేచి చర్మం ఊడిపోవటం జరుగుతుంది. కానీ ఆ అబ్బాయికి శరీరమంతా వచ్చిన అలర్జీ చాలా తేడాగా కనిపించింది. వైద్య పరీక్షల్లో అది నికెల్ అలర్జీ అని తేలింది. అది ఎక్కడి నుంచి సోకిందా అని చూస్తే ఆ అబ్బాయి 2010 నుంచి వాడుతున్న ఐప్యాడ్ నుంచని డాక్టర్లు నిర్ధారణ చేసారు.
ఐప్యాడ్ ని అబ్బాయి రోజూ వాడేవాడని అతని తల్లి చెప్పింది. దానికి ఇప్పుడు రక్షక కవర్ ని తొడిగిన తర్వాత అబ్బాయి వ్యాధి నయమవుతోందని కూడా ఆమె తెలియజేసింది.
నికెల్ అలర్జీలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయని డాక్టర్ జాకొబ్ అన్నారు. ఈ విషయంలో ఆమె డేటా కూడా చూపిస్తూ పది సంవత్సరాల క్రితం 17 శాతంలో ఉన్న ఎలర్జీ ఇప్పుడు 25 శాతానికి పెరిగిందని చెప్పారు.
అయితే నికెల్ అలర్జీలు కేవలం ఐప్యాడ్, కంప్యూటర్లతోనే కాదు సెల్ ఫోన్లతోను, ఒక్కోసారి కళ్ళజోడు ఫ్రేం, జిప్ లతో కూడా వచ్చే అవకాశం ఉంది. నికెల్ అలర్జీ బాగా వచ్చినప్పుడు కొన్ని సందర్బాల్లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా వాడవలసిన అవసరం కలిగిందని కూడా డాక్టర్ జాకొబ్ అన్నారు.
దీనికి పరిష్కారమార్గమేమిటో కూడా శాస్త్రజ్ఞులే చెప్పాలి. ఎందుకంటే ఈ వస్తువుల వాడకం మన జీవితంలో విడదీయలేనిదైపోయింది. ప్లాస్టిక్ క్యాన్సర్ కి హేతువని చెప్పారు కానీ దానికి ప్రత్యామ్నాయం లభించలేదు. ఇంకా ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనేవున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలలోంచి వచ్చే నికెల్ అలర్జీనుంచి కూడా ప్రత్యామ్నాయం దొరికేంత వరకు వాటిని ఉపయోగించక తప్పదు, వాటి ప్రభావానికి బాధపడకా తప్పదు.
పూర్వకాలం కావిడి మోసేవాళ్ళకి, గుర్రపు స్వారీ చేసేవారికి శరీరం మీద కాయలు కాసేవి. వాటికి ప్రత్యామ్నాయం దొరికిన తర్వాత ఆ బాధలు తప్పాయి. అదేవిధంగా నికెల్ అలర్జీని కలిగించే ఎలక్ట్రానిక్ ఇతర సాధనాలకు ప్రత్యామ్నాయం లభిస్తే కాని ఈ అసౌకర్యం తొలగదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more