ప్రతిపక్షాలకు ఖాళీ సమయం లేకుండా వాళ్ళని బిజీగా ఉంచటం వలన వాళ్ళు అందులో వ్యస్థులై తన మీదకు ఎక్కువగా రావటానికి సమయం చిక్కకుండా ఉంటారన్నది మోదీ విధానమేమో అని కొందరు రాజకీయ విశేషజ్ఞలు అనుమానిస్తున్నారు. అందుకు కారణం నేషనల్ హెరాల్డ్ అక్రమంగా వ్యాపారం చేస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కేసు వెయ్యటం, అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాటాలుండటం. ఇది కేవలం సుబ్రమణ్య స్వామి ఐడియా కాదేమో, దీని వెనక మోదీ హస్తం కూడా ఉందేమో అని సందేహిస్తున్నారు.
అయితే ఒకవేళ అదే నిజమే అయినా, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా అందులో సత్యం లేకపోతే వీగిపోతుందిగా. సత్యం లేకపోవటం కాదు నిజానికి సోనియా రాహుల గాంధీలకు ఆ అభియోగం మీద వివరణనీయటం క్లిష్టమైన పనిగానే మారింది.
యంగ్ ఇండియా అనే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గరిష్టస్తాయిలో వాటాలను కలిగివున్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయమైన హెరాల్డ్ హోస్ లో నడిచిన నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక చాలాకాలంగా మూతబడింది. ఆ భవనాన్ని అద్దెకి ఇవ్వటమే లాభాపేక్ష రహిత సంస్థ వ్యాపారసంస్థగా మారిందని సుబ్రమణ్య స్వామి ఆరోపించటానికి కారణం. దానిలోని ఐదు అంతస్తులూ మార్కెట్ రేటుకి అద్దెకివ్వటం జరిగింది. అది కూడా ప్రభుత్వ కార్యాలయాలకు.
గ్రైండ్, ఫస్ట్ ఫ్లోర్ లు ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖ కింద పనిచేసే పాస్ పోర్టు సేవాకేంద్రానికిచ్చారు. సెకండ్, ధర్డ్ ఫ్లోర్ టాటా కంపెనీ టిసిఎస్ కిచ్చారు. పాస్ పోర్ట్ కేంద్రం మార్కెట్ రేటు ప్రకారం నెలకి 60 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుండగా టిసిఎస్ నెలకి 27 లక్షల రూపాయాలను చెల్లిస్తోంది. టాప్ ఫ్లోర్ లో యంగ్ ఇండియా కార్యాలయం ఉంది. అది కంపెనీస్ యాక్ట్ లోని సెక్షన్ 25 కింద రిజస్టరైంది. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మేజర్ వాటాలున్నాయి- 76 శాతం వరకు. మిగితా వాటాలు కాంగ్రెస్ నాయకులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్ ల పేర్ల మీద ఉన్నాయి.
మామీద ఎంత బురదజల్లటానికి ప్రయత్నిస్తే మేమంత త్వరగా మళ్ళీ కేంద్రస్థానానికి, అధికారంలోకి వస్తామంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అంత సులభంగా తప్పించుకునేది కాదు. దీనికి ఎంతో వివరణనీయవలసిన అవసరం ఉంది. వార్తా పత్రికను నడపటానికి ప్రభుత్వం చౌక ధరలో కేటాయించిన స్థలంలో భవంతిని నిర్మించి దాన్ని మార్కెట్ రేట్ కి అద్దెకిచ్చి లాభాలు గడిస్తామంటే అది స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలలోకి రాదు. ఇది రాజకీయంగా దెబ్బతీసే చర్యంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినా, సత్యాలను మార్చటానికి ఆస్కారమైతే లేదు.
పూర్తి వివరాలు, లావాదేవీలలోకి వెళ్తే,
కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థకి రుణంగా ఇవ్వటం జరిగింది. అది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను నడిపి మూసేసింది. ఆ పత్రికను లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ గా రిజిస్టరైన యంగ్ ఇండియా అనే సంస్థ రూ.50 లక్షలకు టేక్ ఓవర్ చేసింది. ఈ యంగ్ ఇండియా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే ముఖ్యమైన వాటాదారులు. దరిమిలా అసోసియేటెడ్ జర్నల్స లిమిటెడ్ పేరు మీద ఉన్న ఆస్తులను సొంతం చేసుకుంది. అంటే 50 లక్షల రూపాయలకే 1600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సంగ్రహించటం జరిగింది. యంగ్ ఇండియాలో మొత్తం 5000 షేర్లలో 1900 షేర్ల చొప్పున తల్లీ కొడుకులిద్దరికీ మొత్తం 3800 షేర్లున్నాయి.
మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా ఇప్పటికే నోటీసులు జారీచేసి ఉన్నారు. అందులో నిందితుల మీద జరిగిన అభియోగానికి మద్దతుగా ప్రాథమికంగా సాక్ష్యాధారాలు కనిపించాయని, పబ్లిక్ మనీని పర్సనల్ ఉపయోగం కోసం కన్వర్ట్ చెయ్యటానికి అనుకూలంగా యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా చెయ్యటానికి కాని, లేదా 2000 కోట్ల రూపాయల ఆస్తిని కైవసం చేసుకోవటానికి పన్నిన పథకంలా కాని కనిపిస్తోందని ఉంది.
ఈ విషయంలో స్పందించిన ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీ నుంచి పన్ను మినహాయింపునెందుకు రద్దు చెయ్యగూడదని అడగుతూ నోటీస్ ఇవ్వటానికి సిద్ధమౌతోంది.
అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఆ ఆదాయం ఎవరికి చేరుతోంది. వసూలైన అద్దెలు ఎవరి ఖాతాల్లోకి పోతున్నాయి.
వీటన్నిటికీ సమాధానం లేకుండా కేవలం రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకునే చర్యగా మా మీద కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనటం సహజమే ఎందుకంటే పై విషయంలో పూర్తి వివరణ నివ్వటం కష్టమే కాబట్టి. ఆరోపణకు ఆధారంగా కానీ ప్రైమా ఫాసీ సాక్ష్యాధారలు ఉన్నాయని కోర్టు చెప్తున్నప్పుడు కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు అని అనటం, ఇలా చెయ్యటం మాకే మంచిది, దీని వలన ప్రజల దృష్టి మామీద కేంద్రీకృతమౌతుందు, దానితో మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అన్నది భ్రమే అని అర్థమౌతోంది.
నిజంగానే కక్షసాధింపు చర్యే అయినా, కాంగ్రెస్ ని దేశంలోనే లేకుండా చేస్తామని అని భాజపా ఎన్నికల ముందే స్పష్టం చేసింది కాబట్టి అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆఁ. … ఏమీ లేకుండా అనవసరంగా కేసుల్లో ఇరికిస్తే అనాలి. కానీ వాస్తవాలను వెలుగులోకి తెస్తుంటే అది కక్ష సాధింపు ఎలా అవుతుంది?
ఒకవేళ మోదీ నిజంగానే వైరి పక్షాలను బిజీగా ఉంచదలచుకున్నా అదీ రాజకీయంలో భాగమేగా. తన స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యటం అపరాధమేమీ కాదు. ఎందుకంటే ఆ పనే చెయ్యకపోతే ఏ రాజకీయ నాయకుడైన తాను అనుకున్న పనులను క్రియారూపంలో పెట్టలేరు- అది మంచే కానీ చెడే కానీ.
అందువలన, తన మీద పడ్డ అభియోగం నుంచి తప్పించుకోవటానికి ఆధారాలను సమకూర్చుకునే పనిలో పడాలి కానీ కాంగ్రెస్ నాయకులు ఇదంతా రాజకీయ వైరంతో చేస్తున్న పనులే అని చెప్తూ చేతులు దులుపేసుకుందామనుకుంటే చివరి క్షణాల్లో, చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చెయ్యలేకపోతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more