కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఏదోవిధంగా నలిగిపోతూనేవస్తున్నారు. అధిష్టానానికి చెప్పలేక, ప్రజలను ఒప్పించలేక, ఇతర పార్టీలను ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి ఎత్తిపొడుపులకు తట్టుకోలేక తెలంగాణా కాంగ్రెస్ నాయకులు నానా హైరానా పడ్డారు. ఢిల్లీ పోతే నాయకురాలు ఏమీ చెప్పకపోవటం, వెనక్కి వస్తే ఉత్తి చేతుల్లో ఎలా వస్తారు ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లోకి రానివ్వరంటూ తెరాస బెదిరింపులు వీటి మధ్య ఏం చెయ్యాలో తోచక పార్టీలు మారినవారూ ఉన్నారు, రాజీనామాలు చేసినవారూ ఉన్నారు, తమ సొంత పార్టీ మీదనే నిరసన చూపించినవారూ ఉన్నారు. కానీ ప్రతి సందర్భంలోను తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా దిక్కుతోచని పరిస్థితుల్లోనే కొట్టమిట్టాడారు.
తీరా తెలంగాణా వచ్చినా 2014 ఎన్నికలలో ఘోరపజాయంతో రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షంగానైనా ఉన్నామంటూ సంతోషపడుతుంటే, పోలవరం ఆర్డినెన్స్ రాజ్యసభలో కూడా పాసై చట్టరూపం దాల్చింది. దానితో, అసలే దానిమీద గుర్రుగా ఉన్న తెరాస మరోసారి కాంగ్రెస్ మీద విరుచుకుపడటానికి మళ్ళీ అవకాశం చిక్కింది.
పోలవరం ఆర్డినెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, భారతీయ జనతా పార్టీ కేవలం దానికి చట్టబద్ధత తీసుకునివచ్చే ప్రయత్నమే చేసిందని భాజపా వాదన తెలంగాణా కాంగ్రెస్ ని మరోసారి ఇరుకునపడేసింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ మాత్రం స్థానాలు కూడా దక్కించుకోకుండా తెరాస ప్రయత్నం చెయ్యదలచుకుంటే, ఇదో అయాచితంగా దోరికిన అవకాశమే. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ వలన తెలంగాణాకి నష్టమని, ముంపు ప్రాంతాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో కలుపుతున్నారని ఆందోళన చేసిన తెరాసకి, ఆ పాపమంతా కాంగ్రెస్ దేనని చెప్పటం, జైరాం రమేశ్ లాంటి నాయకులు అది నిజమేనని ఒప్పుకోవటంతో తెలంగాణా కాంగ్రెస్ మెడకి మరో ఆరోపణ పోలవరం రూపంలో చుట్టుకుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more