ఎన్ కన్వెన్ష్ విషయంలో జిహెచ్ఎమ్ సి దూకుడుకి కళ్ళెం వేస్తూ హైకోర్ట్ స్టేటస్ కో ని ఆదేశించింది. గ్రేటర్ హైద్రాబాద్, నీటిపారుదల శాఖవారు ఎన్ కన్వెన్షన్ లో చేసిన సర్వేలలో భూకబ్జా కింద అభియోగాన్ని మోపుతూ నోటీసులు అంటించటంతో అంతకు ముందు గురుకుల ట్రస్ట్ లో నోటీసుల్లేకుండా భవనాలను కూల్చిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున హైకోర్ట్ ని ఆశ్రయించగా, హైకోర్టు నిర్దేశించిన యథాతథస్థితి వలన ఊరట నాగార్జునకు కలిగింది.
నాగార్జున వాదన
గురుకుల ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్ లాల్ నుంచి కొందరు కొన్న భూముల నుంచి నాగార్జున 27 వేల చదరపు మీటర్లను కొనుగోలు చేసి హుడా అనుమతితో ప్రహరీగోడను నిర్మించారు. చట్టప్రకారం కొనుగోలు చేసిన భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించి, గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన నుంచి దాన్ని నిర్వహించటానికి అనుమతులు తీసుకుని దానిమీద ఆస్తిపన్ను కూడా చెల్లిస్తూ వస్తున్నారు. క్రమబద్ధీకరణకోసం అధికారులకు పెట్టుకున్న అప్లికేషన్ ని ప్రభుత్వం తిరస్కరించగా దానిమీద నాగార్జున అప్పట్లో హైకోర్ట్ కి వెళ్ళటం జరిగింది. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని అప్పుడు కోర్టు ఆదేశించటం కూడా జరిగింది.
తాజాగా వచ్చిన అధికారులు ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉందని మార్కింగ్ చేసారు. 1992 లోనే చేసిన కొనుగోలు మీద అప్పుడు ఎటువంటి ప్రకటనలు చెయ్యని అధికారులు ఇప్పుడు ఎలా అభ్యంతరాలు తెల్పుతారు, నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను ఎలా కూల్చివేస్తారన్నది నాగార్జున ప్రశ్న. పైగా నియమానుసారం చూస్తే చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లకంటే ఎక్కువగా ఉంటేనే 30 మీటర్ల బఫర్ జోన్ వర్తిస్తుంది. కానీ ఎన్ కన్వెన్షన్ ఉన్న తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లకంటే తక్కువగా ఉంది. ఈ వివరాలను హెచ్ఎమ్ డిఏ వెబ్ సైట్లో చూడవచ్చునని కూడా నాగార్జున తెలియజేసారు.
మొత్తానికి ప్రస్తుతానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి ముప్పు తప్పింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more