రాష్ట్ర విభజన తర్వాత ఆదుకుంటామని మాటిచ్చిన ఆపన్న హస్తం అధికారంలో లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తాన్నందించిన భాజపా ప్రభుత్వం ఆ హామీలన్నిటినీ నెరవేరుస్తామని మాటిస్తూవస్తోంది. ఏది ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నవాళ్ళకి ముందుగా హాస్పిటల్స్ తో బోణీ కొడుతోంది కేంద్ర ప్రభుత్వం.
రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ విషయంలో ఆశావహకమైన ప్రకటన చేస్తూ, విజయవాడ పరిసరాల్లో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 1200 కోట్ల ఖర్చుతో రాబోతోందని, దీన్ని పరిశీలించటానికి రెండు రోజుల్లో కేంద్ర బృందం వస్తోందని తెలియజేసారు.
రాష్ట్ర విభజన వలన విద్య, వైద్యసేవల విషయంలో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు కష్టమౌతుందని సీమాంధ్ర నాయకులు అప్పట్లో అభ్యంతరాలు తెల్పటంతో వాటిని అభివృద్ధి చేస్తామని యుపిఏ ప్రభుత్వం మాటిచ్చింది. దాన్ని ఎన్డియే ప్రభుత్వం ఇప్పుడు అమలు పరుస్తోంది.
కొత్త హాస్పిటల్ తో పాటు ప్రస్తుతమున్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ని కూడా 292 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తామని, మఛిలీపట్నంలో 20 కోట్ల వ్యయంతో నర్సింగ్ కాలేజ్ ని నిర్మిస్తామని కూడా మంత్రి కామినేని శ్రీనివాస్ మాటిచ్చారు.
మొన్న నందమూరి బాలకృష్ణ బసవతారక కేన్సర్ హాస్పిటల్ ని హిందూపురంలో నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి హాస్పిటల్స్ తో బోణీ కొడుతోంది
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more