గురువారం ఢిల్లీకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజి బిజీ గా తిరిగారు. ఉదయం నుండి రాత్రి వరకు మొత్తం తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సమావేశమైన
చంద్రబాబు వారి నుంచి రాష్ట్రం కోసం వివిధ హామీలను పొందారు.
నేరుగా కేంద్ర మంత్రులతోనే భేటీ అయిన చంద్రబాబు నాయుడు తనతో పాటు రాష్ట్ర మంత్రులను కూడా తీసుకెళ్ళి పరిచయం చేసి రాష్ట్రంలోని సమస్యలను వాళ్ళచేతనే చెప్పించారు.
అందులో ప్రముఖంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుండి రూ.15,600 కోట్ల సత్వర ప్యాకేజీ విషయంలోను, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించటంలోనూ నిర్దిష్టమైన హామీలను పొందారు. ఇది కాకుండా అదనపు సహాయంగా కేంద్రం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.5,600 కోట్ల గురించి, రైతులకు ఋణ మాఫీ గురించి అరుణ్ జైట్లీతో చర్చించారు. వీటన్నిటిమీదా అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు.
రాజధానిని మీరు నిర్ణయించండి, వెంటనే దాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం, మెట్రో లైన్లను ప్రారంభిస్తాం అంటూ పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.
13 ఓడరేవులను కలుపుతూ కోస్తా కారిడార్ ని ఏర్పాటు చెయ్యటం, విశాఖపట్నాన్ని రైల్వే జోన్ గా ప్రకటించటం, జాతీయ సంస్థల స్థాపన విషయంలోను సంబంధిత మంత్రులు హామీ ఇచ్చారు. నిరంతర విద్యుత్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పీయూష్ గోయల్ మాటిచ్చారు. చంద్రబాబుకి విద్యుత్ రంగం మీద ఉన్న సంపూర్ణ అవగాహనకు పీయూష్ గోయల్ ఆయనను అభినందించి, ఆయన దగ్గర తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. ఐఐటి ఐఐఎంల స్థాపనకు స్థలాన్ని చూపిస్తే ప్రారంభిస్తామంటూ మానవవనరుల మంత్రి
స్మృతి ఇరానీ అన్నారు.
మొత్తానికి రోజంతా సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనంలో కేంద్రం నుంచి నిర్ధిష్టమైన హామీలను పొందటంలో కృతకృత్యులయ్యారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more