ఆపదలు, కష్టాలు, బాధలు, వచ్చినప్పుడే.. అందరికి దేవుడు కనిపిస్తారని .. మన పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాల నిజం అని నమ్మె పరిస్థితి వచ్చింది. ఒంటిచేత్తో .. దేశాన్ని ..10 సంవత్సరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీకి దేవుడు గుర్తుకువచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు.. కనిపించని దేవుడు, అధికారం పోయిన తరువాత స్వామి అనుగ్రహం కావాల్సి వచ్చింది.
ఒక పక్క సోనియా గాంధీ దేవత అని కొన్ని రాష్ట్రాల ప్రజలు గుడులు కట్టి, పూజలే చేస్తుంటే, అలా దేవతకు.. ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో.. సృష్టికి లయకారుడైన.. శివయ్య కోసం సోనియా దేవత పరుగులు పెట్టింది. ఎప్పుడులేనిది ..కొత్తగా సోనియా గాంధీ శివాలయానికి వెళ్లటంతో ..కాంగ్రెస్ నేతలు, రాజకీయ నేతలు షాక్ తిన్నారు.
ఎప్పుడు నాయకులపై అధికారం చెలాయించే ..అమ్మకు.. దైవం ఇప్పుడు ప్రేమ పుట్టింది ఏంటా ? అందరు ఆశ్చర్య పోతున్నారు. కానీ దానికి కారణం ఉందని అంటున్నారు. నిన్న, రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి , ఢిల్లీ కోర్టు సమాన్లు పంపించింది. దీంతో తల్లి కొడుకులు ..ఏం చేద్దాం? అనే ఆలోచనల్లో పడి, చివరకు అమ్మ చెప్పినట్లు.. మన కష్టాలనుండి బయటపడాలంటే.. ఒక్కటే మార్గం. అంతభారం .. ఆ శివయ్య మీదే వేద్దాం అని .. ఉత్తరాఖండ్ లోని బగేశ్వర్ జిల్లాలో కౌసనిలో ఉన్న శతాబ్ధం క్రితం నాటి ‘‘రుద్రధరి శివాలయాన్ని ’’ సోనియా గాంధీ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి సందర్శించుకున్నారు.
సోనియా గాంధీ శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, ఆ రాత్రికి తమ కుటుంబ మిత్రుడి ఇంట్లో బస చేయటం జరిగింది. పాపం అమ్మకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో.. ఇలా నడిచి వెళ్లి , శివయ్యకు చెప్పుకుందని అక్కడ స్థానికులు ఆశ్చర్యంగా చెప్పకుంటున్నారు. ‘‘ శివుడి అనుగ్రహం లేనిదే.. చిన్న చీమమైన ..కుట్టదని’’ మన పూర్వీకులు చెబుతుంటారు. మరీ సోనియా కష్టాలను శివయ్య తీర్చుతాడో లేదో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more