రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలతో ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితుల్లో .. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉన్నారు. తండ్రి బాటలో.. నడుస్తూ.. అత్యాచారం మరకలను. తన ఒంటిపైకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఇద్దరు దళిత టీనేజ్ యువతులపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై నిరసనగా.. ముఖ్యమంత్రి కార్యలయం వద్ద ధర్నా చేపట్టిన వందలాది మంది మహిళలపై.. వాటర్ కెనాన్లు ప్రయోగించి , మరో తప్పు చేశారు అఖిలేష్ యాదవ్. దీంతో.. కేంద్ర హోంశాఖ అఖిలేష్ యాదవ్ పై కన్నెర్ర చేసింది.
దళిత టీనేజ్ యువతులపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కఠిన నిబంధనలతో ఎందుకు కేసులు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమే తాము రాసిన లేఖ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రితిజు తెలిపారు. నిందితులపై కఠిన చర్య తీసుకోవాల్సిందేనని రితిజు స్పష్టం చేశారు.
ఈ ఘటన చాలా తీవ్రమైన నేరమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. ఆత్మరక్షణలో పడిన అఖిలేష్ ప్రభుత్వం హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్ కుమార్ గుప్తాను బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్లో పెట్టింది. అయితే మృతులు ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు కాదని శాంతిభద్రతల విభాగం ఐజి అమరేంద్ర సెంగార్ తెలిపారు.
జిల్లా స్థాయి అధికారుల్లో దీనిపై ఎటువంటి గందరగోళం లేదని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయాలని సిబిఐకి లేఖ రాసిన సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, గవర్నర్ బిఎల్ జోషితో సమావేశం కావడం గమనార్హం. మరోవైపు మృతుల తండ్రి తనకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని కోరడం ఈ వ్యవహారంలో కొసమెరుపు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more