పోలవరం ప్రాజెక్ట్ మీద బుధవారం కేంద్ర కేబినెట్ లో జరిగిన తీర్మానాన్ని గుప్తంగానే ఉంచినా, అందులోని సారాంశాన్ని పసిగట్టిన తెలంగాణా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపటాన్ని వ్యతిరేకిస్తున్నామని, అదే జరిగితే తెలంగాణాలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
కానీ అర్డినెన్స్ రానేవచ్చింది, కెసిఆర్ బంద్ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకున్న ఆర్డినెన్స్ మీద అభ్యంతరాలు తెల్పుతూ కెసిఆర్ రాష్ట్రపతికి రాసిన లేఖలో సారాంశం ఇది-
1.ఆర్డినెన్స్ అప్రజాస్వామికం. భారత రాజ్యాంగం ఆర్టికిల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంది, తెలంగాణా 29 వ రాష్ట్రంగా ఏర్పడింది. జూన్ 2 ను అప్పాయింటెడ్ డే గా తీర్మానం చెయ్యటం జరిగింది. ఆ మేరకు గెజిట్ లో నోటిఫికేషన్ వెలువడింది. అలా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర ఎల్లలు మార్చగల అధికారం కేవలం తెలంగాణా రాష్ట్రానికే ఉంది. పార్లమెంటుకు కూడా లేదు. రాష్ట్రంలోని చట్టసభలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్లుగా రాష్ట్ర సరిహద్దులను మార్చటం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయంలో సుప్రీం కోర్టు బొమ్మై కేసులో స్పష్టం చేసింది. సరిహద్దులలో మార్పులు తేవాలంటే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసన సభలకు పంపించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పార్లమెంటులో ఆమోదం పొందాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరచిన నియమం.
2. గిరిజన ప్రాంతాలు ముంపుకి గురౌతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ ని మార్చాలి.
3. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత డిజైన్ వలన 460 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు వెళ్ళిపోతుంది.
4. ముంపు వలన తెలంగాణా ప్రాంతమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ గఢ్ లకు కూడా నష్టం కలుగుతోంది.
పోలవరం విషయంలో చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చూడండి అన్న కెసిఆర్, పోలవరం విషయంలో తెలంగాణాకు అన్యాయం జరగటాన్ని సహించమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కెసిఆర్ రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిసి మాట్లాడారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more