గోదావరి పుష్కరాలు పుణ్యమా అని రాజమండ్రిలోని (గోదావారి) కొన్ని కీలకమైన పోస్టులకు ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడుతోంది. 2015 జూలై 14 నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి విదితమే. పుష్కరాల్లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఎక్కడ పుణ్యస్నానం చేసినా ఒకే ఫలితం ఉన్నప్పటికీ, దేశం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులంతా రాజమండ్రికే తరలి వస్తుంటారు.
అందువల్ల గోదావరి పుష్కరాలు పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది రాజమండ్రి నగరమే. దాంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు రాజమండ్రి నగరంపైనే దృష్టికేంద్రీకరిస్తారు. 2003లో జరిగిన పుష్కరాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సుమారు రూ.100కోట్లు ఖర్చుపెట్టినట్టు అంచనా. రానున్న 2015 పుష్కరాలకు కూడా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగానే నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
అందులోనూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటం, రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపి కూటమి అధికారంలో ఉండటంతో గోదావరి పుష్కరాలకు గతం కన్నా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి ఎమ్మెల్యే ప్రాతినిధ్యంవహిస్తుండటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడనుంది. అంటే గోదావరి పుష్కరాల ఏర్పాట్లతో సంబంధం ఉన్న అన్ని శాఖలకు భారీగానే నిధులు మంజూరవుతాయన్న మాట.
ఇదే ఇపుడు రాజమండ్రిలోని వివిధ శాఖల పోస్టులకు విపరీతమైన గిరాకీని తెచ్చిపెడుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో పనిచేస్తే అంతో ఇంతో వెనకేసుకోవచ్చన్న ఆశతో రాజమండ్రిలోని వివిధ శాఖల పోస్టుల కోసం అప్పుడే కొంత మంది అధికారులు కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.
ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయకపోయినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులవుతామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నంచేసుకునే పనిలో ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కూడా అప్పుడే తమ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా పనిచేసేందుకు అనుకూలంగా ఉన్న అధికారుల కోసం వేట మొదలుపెట్టారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more