ఎన్నికలు అయిపోయాయి కదా, ఫలితాలు ఇవిఎమ్ లలో భద్రంగా ఉన్నాయి, అవి మే 16 కి వెల్లడౌతాయి. కానీ ఈలోపులో బెట్టింగ్ లకు మంచి వ్యవధి దొరికింది. ఈ బెట్టింగ్ ల జోరు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా కనిపిస్తోంది.
ప్రముఖంగా బెట్టింగ్ తెదేపా గెలుస్తుందా లేక వైకాపా అన్నదానిమీదనే ఉంది. ఇంకా లోతుగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిమీద కూడా పందేలు జరుగుతున్నాయి కాని అవి తక్కువగానే ఉన్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నదానిమీద కాసిన పందేలు 100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. మూడు నుంచి ఐదు రెట్ల వరకు పందేలు సాగుతున్నాయి. తరువాతి స్థానం రాయలసీమలోని నాలుగు జిల్లాలలది. నాలుగు జిల్లాలలో కలిపి 30 కోట్ల వరకు పందేలు సాగుతున్నాయని అంచనా. వైయస్ జగన్, విజయమ్మ గెలుపు, మెజారిటీల మీద అధికంగా పందేలు కాస్తున్నారు.
ఎన్నికలయ్యేంత వరకు విరివిగా ఖర్చుపెడుతూ తమ మీద తామే పందెం కాసుకున్న రాజకీయ నాయకులు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ప్రజల వాళ్ళ మీద పందేలు కాస్తున్నారు. ఎన్నికలలో డబ్బు చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత.
ఎన్నికల ప్రచార సాధనాలు, సామగ్రి, ఏర్పాట్లు, రవాణా, భోజన సదుపాయాలు, ఇవి కాక వోటర్లకు డబ్బు పంచడాలు, బహుమానాలు ఇవ్వటాలు- ఈ ఏర్పాట్లను చూసేవారు తృణమ పణమో మిగిల్చుకోవటాలు, అభ్యర్థులు పెట్టే ఖర్చులో వెనకేసుకునేవారు, పెట్రోల్ డీజిల్ డీలర్లు, ఇక ఈ సారి ఎన్నికలలో బాగా ఖర్చుపెట్టింది విమానాలు, హెలికాప్టర్ల మీద. ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు రాజకీయ పందేలుగా పెడుతుంటే అందులో లాభపడ్డవాళ్ళు చిలక్కొట్టుడు కొట్టేవాళ్ళు ఉంటారు. అలా వెనకేసుకున్న డబ్బును పందేలలో పెట్టేవారున్నారు. వచ్చిందా కనీసం మూడురెట్లవుతుంది. పోయిందా, తేరగా వచ్చిన సొమ్మే కదా అనుకునేవారూ ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more