భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి వలన భాజపాకి అమితమైన మద్దతు లభించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిచోట్లా అంగీకరించటం జరుగుతోంది. అలా అంగీకరించటం వలన మానసిక సంసిద్ధత కలుగుతుందన్నది నిర్వివాదం. కానీ పార్టీ శ్రేణులు నీరసపడిపోయి ఓడక ముందే, అంటే ప్రకటన జరగకముందే ఓటమిని అంగీకరించటం కూడా జరుగుతుంది. దాన్ని అధిగమించటం కోసం ఆ ప్రకటనలలో కొంత ఉత్సాహాన్ని కూడా నింపాల్సి వస్తుంది.
పార్టీ గెలుస్తుందని నమ్మినప్పుడే పార్టీ శ్రేణులు చివరి వరకూ పోరాడుతారు. అందువలన వోటమిని అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ చేదు తెలియకుండా వాటికి తీపి పూత కూడా పూస్తోంది.
శ్రీకాకుళంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన జైరాం రమేశ్ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందనటంలో అనుమానం లేదనే విషయాన్ని అంగీకరిస్తూనే, ఎన్డియే కూటమికి మాత్రం మెజారిటీ రాదని, అందువలన యుపిఏ ప్రభుత్వమే కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందని తను వేసిన లెక్క చెప్పారు.
అలాగే రాష్ట్రం విషయానికి వచ్చేసరికి, సీమాంధ్రలో కాంగ్రెస్ స్వయంకృతమే ఓటమికి కారణమవుతుందని, అందుకు సీమాంధ్ర నాయకత్వ లోపమే అసలు కారణమని అని శ్రీకాకుళంలో అన్న జైరాం రమేశ్ తర్వాత దాన్ని సమర్థించుకుంటూ, తన మాటలను మీడియా వక్రీకరించిందని, పార్టీకి క్లిష్ట పరిస్థితి ఉన్నమాట వాస్తవమే కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా నష్టపోయిందో అంతే వేగంగా పుంజుకుంటుందని భవిష్యవాణి చెప్పారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్రలో ఆదరణ తగ్గుతుందేమోనని భయపడ్డామని కానీ అలా జరగలేదు కాబట్టి సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఖాయంగా వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more