అగ్రనేతలు ఒకరు పోటీచేస్తున్న ప్రాంతంలో మరొకరు పోటీ ప్రచారానికి రాగూడదని ఇంతవరకున్న లిఖితపూర్వకంగా లేని ఒక అవగాహనను అధిగమిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాని వెళ్ళారు.
అమేథీలో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీకి పోటీగా ఎన్నికలలో పార్లమెంటు స్థానానికి భాజపా తరఫున నిలబడ్డారు. రాహుల్ గాంధీ ఈ స్థానంలో భాజపా అభ్యర్థితో పాటు ఆఆపా అభ్యర్థి కుమార్ విశ్వాస్ తో త్రికోణ పోటీలో ఉన్నారు.
2004 నుంచి రాహుల్ గాంధీకి విజయాన్నందించే స్థానంగా పేరుగాంచిన అమేథీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం వోటర్ల అభిమానాన్ని చూరగొనటంతో భాజపా విజయం అక్కడ ప్రశ్నార్థకమే అని వినిపిస్తున్న తరుణంలో అక్కడ ప్రచారానికి సాక్షాత్తూ మోదీని దింపటంతో భాజపా కూడా అదే అనుమానంతో ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవటం కోసం ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజున తీవ్ర ప్రయత్నం చేస్తోందనిపిస్తోంది.
12 లోక్ సభ ఎన్నికలలో 10 సార్లు గాంధీ కుటుంబీకులకు అమేథీ గెలుపునందించినా, పోటీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో అక్కడ ప్రియాంకా వాద్రాను ప్రచారంలోకి తీసుకునివచ్చింది.
అమేథీ, రాయ్ బరేలీ, సుల్తాన్ పుర్ ప్రాంతాలలోంచి మోదీ సభకు కనీసం రెండు లక్షల మంది జనసమీకరణ చెయ్యాలని భాజపా ప్రయత్నం చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమధ్య, కాంగ్రెస్ అగ్ర నాయకులు పోటీ చేస్తున్న చోట భాజపా అగ్రనాయకులు, అలాగే భాజపా అగ్రనాయకులు పోటీచేస్తున్న చోటికి కాంగ్రెస్ పెద్దలు ప్రచారానికి పోకపోవటాన్ని ఎత్తి చూపుతూ, వాళ్ళిద్దరిలో ఏమీ తేడా లేదంటూ విమర్శలకు దిగారు.
అందుకు జవాబుగా అన్నట్లుగా కూడా అమేథీలో మోదీ ప్రచార సభ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more