కేసీఆర్ సీమాంధ్ర ప్రజల్ని బూతులు తిడుతుంటే తాను సీమాంధ్రుడ్ని అని చెప్పుకున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎందుకు స్పందించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అంటే జగన్ కు భయమా అని ఆయన నిలదీశారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ప్రజలపై విపరీతమైన ప్రేమ కలిగిందని ఆయన అన్నారు.
అందుకే జగన్ ఓదార్పు యాత్ర ఎంతకీ తెగడం లేదని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, సీమాంధ్రలో జగన్ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు.
ముందు కేసీఆర్ క్షమాపణలు చెబితే తరువాత తాను ఆలోచిస్తానని సినీ నటుడు, పవన్ కల్యాణ్ తెలిపారు. తనపై దాడులకు దిగితే తలవంచుతానని అన్నారు. తాను దాడికి దిగాలంటే కత్తులు, కొడవళ్లు అక్కర్లేదని, తన అభిమానులతో కలిసి నడిచి వెళ్తే చాలని ఆయన అన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more