హైదరాబాదులోని ఎల్బీ స్టీడియంలో ఓ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. సభావేదికపై మోడీ మధ్యలో కూర్చోగా, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కూర్చున్నారు. ఎల్బీ స్టేడియం బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముగ్గురు కెమిస్ట్రీ అదిరింది
పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కాంబినేషన్ అదిరింది. ఇక లెక్కల్లో ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 3 అవుతుందని... కానీ ఇక్కడ ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 111 అవుతుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు.
ఈ ఎన్నికలంటే లెక్కలు కాదని... బంధాలు, అనుబంధాలు అని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్ కెమిస్ట్రీ అద్భుతంగా కలిసిందని కితాబిచ్చుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కాని, దాని మిత్రపక్షాలు కాని గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనాలు తప్పుతాయని... వారంతా ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేస్తున్నారని దుయ్యబట్టారు. విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు.
విన్ విన్ కాంబినేషన్
ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ ప్రధాని కావడం ఖాయమనే విషయం అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తనది, మోడీది విన్ విన్ కాంబినేషన్ అని... కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
రైతులు బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని తెలిపారు. ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది కాని, ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మన్మోహన్ అసమర్థ ప్రధాని అయితే... రాహుల్ గాంధీ అవగాహన లేని నాయకుడని ఎద్దేవా చేశారు. దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
మోసపూరిత మేనిఫెస్టో
ఎన్డీఏ అధికారంలోకి రాగానే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలో భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని తెలిపారు.
ఈ దేశాన్ని ఇలాగే వదిలేద్దామా? లేక, అభివృద్ధి చెందాలని కలలు కందామా? అని ప్రశ్నించారు. దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలంటే బలమైన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరముందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిందని అన్నారు. 10 కోట్ల ఉద్యోగాలంటూ ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మోడీ ఆరోపించారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more