గురివింద గింజ రాజకీయం అనే పేరుతో మొన్ననే ఒక వ్యాసం రాసాం. అందులో, ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ సామాజిక న్యాయంతో పేరుతో ఈ సారి ఎన్నికలలో కేటాయిస్తున్న స్థానాలను నిజంగా హృదయపూర్వకంగా ఇస్తున్నట్లయితే గెలిచిన అభ్యర్థులను చూసుకున్నా అదే నిష్పత్తిలో ఉండాలని అనుకున్నాం. మన అనుమానం నిజమని మచ్చుకి తీసుకున్న ఈ క్రింది గుంటూరు లోని స్థానాలను చూస్తే తెలుస్తుంది.
లోక్ సభ స్థానాలు – గుంటూరు, నరసరావు పేట – కమ్మ కులస్తులు
శాసన సభ స్థానాలు – 14 శాసనసభ స్థానాలలో 9 స్థానాలు తన సామాజిక వర్గానికి ఇస్తూ, రెండు కాపు, ఒక యాదవ, ఒక గౌడ, ఒక ఎస్సీలకు ఇచ్చారు.
లోక్ సభ సీట్లు రెండూ తమ సామాజిక వర్గానికే ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటమంటే ఆ వర్గం సంక్షేమం చూడటం వరకేనని అనుకుంటున్నారా? అలాగే, 14 శాసనసభ స్థానాలకు 9 తమ సామాజిక వర్గానికే ఇస్తున్నట్లయితే దాదాపు 70 శాతం కేటాయిస్తున్నట్లు! అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాలో 70 శాతం వారు వారి కులస్తులే ఉన్నారా?
అన్యాయమనేది అంతటితో ఆగిపోలేదు!
ఇతర కులస్తులకు ఇచ్చిన ఆ ఐదు స్థానాల్లోను నాలుగు స్థానాలు కచ్చితంగా గెలవలేని స్థానాలే! ఇది కుట్రపూరిత రాజకీయమనిపించుకోదా? ఐదవ స్థానమైన ఒక్క మంగళగిరిలో మాత్రం గెలిచే అవకాశాలు సగం సగం ఉన్నాయి. అక్కడ కూడా తెలగ కులస్తులైన రామచంద్ర ప్రభుకి సీటు ఇవ్వటం వలన పార్టీ కార్యాలయంలో పెద్ద రాద్దాంతం జరుగుతోంది!
గుంటూరు పశ్చిమ స్థానానికిచ్చిన రెడ్డి కులస్తుడు, గుంటూరు తూర్పుకిచ్చిన ఎస్ సి, రేపల్లెలో గౌడ, బాపట్లలో కాపు, మాచెర్లలో యాదవ కులస్తులు కచ్చితంగా అక్కడున్న ప్రత్యర్థులమీద, అక్కడున్న సామాజిక వర్గ సంఖ్యాబలం ముందు చూసుకుంటే ఓడిపోయేవారే. అందుకే దాన్ని కంటితుడుపు సామాజిక న్యాయం అని పైన పేర్కొనటం జరిగింది.
ప్రజారాజ్యం పార్టీ వచ్చిన వెంటనే సామాజిక న్యాయం పాటించటం లేదని ఎలుగెత్తిన తెలుగుదేశం పార్టీ ఇప్పడు తను చేసిన పనికి ఏం సమాధానం చెప్తుంది? తమకో న్యాయం ఇతరులకో న్యాయమేనా సామాజిక న్యాయమంటే? ప్రజారాజ్యం పార్టీ కొన్ని సిద్ధాంతాలతో వస్తుంటే మొగ్గలోనే చిదిమేసినప్పుడు చేసినవి రెండు పెద్ద ఆరోపణలు. ఒకటి సామాజిక న్యాయం చెయ్యకుండా తమ కులస్తులకే అగ్రతాంబూలమిస్తున్నారని, రెండవది సీట్ల కేటాయింపులకు కోట్ల రూపాయలలో డబ్బు తీసుకుంటున్నారని!
ఈ రెండవ ఆరోపణలో కూడా తెదేపా తనవరకు వచ్చేసరికి ఎక్కడా తగ్గలేదు. ఎక్కడో చిత్తూరులో ఉన్న వ్యాపారవేత్తను, గుంటూరు లోని వ్యాపార వేత్తను, వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళను తీసుకొచ్చి పార్లమెంటు సీటుని వాళ్ళకి ప్రదానం చేసారంటే దాని వెనక ఏం ప్రయోజనం ఉన్నట్లు? ప్రజాప్రయోజనమైతే కనపడదు! పార్టీ ప్రయోజనం కూడా కాదు! కేవలం ఆర్థిక లాభమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది!
వేరే ప్రాంతాల వ్యాపారవేత్తలకు పార్టీ టికెట్ ఇవ్వటమంటే దాని వెనక ఉన్న ప్రయోజనాన్ని మరేవిధంగానూ చూడలేము. అంతకంటే సేవచేసే వారు, నాయకత్వ లక్షణాలున్నవారు ఆ ప్రాంతాల్లో లేనే లేరా?
ప్రజలకు సేవచేసిన జమీందారీ కుటుంబాలున్నాయి, పూర్వకాలం ప్రజాప్రాతినిధ్యం వహించిన కుటుంబాలున్నాయి. వారిలో ఎవరికి సీటిచ్చినా గెలుపు ఖాయం. పోనీ పార్టీలో చాలాకాలంగా సేవ చేస్తున్నవారికి న్యాయం చెయ్యటం కోసం చూస్తున్నారా అంటే, ఇంతవరకు రాజకీయాలలోకి రానివారు, వేరే పార్టీల వాళ్ళు, ఈ ప్రాంతానికి చెందినవారికి పార్టీ టికెట్ ఎందుకిచ్చినట్లు?
అంటే, కావలసింది అంకిత భావంతో ప్రజాప్రాతినిధ్యం వహించగలిగే నాయకులు కాదు! సినిమా టికెట్ ని బ్లాక్ లో కొనుక్కున్నట్లుగా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకున్న పార్టీ టికెట్. అటువంటి నాయకుల దగ్గర్నుంచి వోటర్లు ఏమాశించగలరు- వాళ్ళు పెట్టుబడిగా పెట్టిన సొమ్మును మరింతలుగా వెనక్కి తీసుకునే ఆశయం తప్ప?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more