ఢిల్లీ శాసన సభ ఎన్నికలలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తిచేత చెంపదెబ్బ తిన్నారు.
ఢిల్లీ లో దక్షిణపురి ప్రాంతంలో రోడ్ షో చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వాహనం మీదకు ఎక్కి గుర్తు తెలియని వ్యక్తి ఆయనమీద చెయి చేసుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని తీసికెళ్ళారు కానీ ఈ లోపులో అతగాడికి ఆఆపా మద్దతుదార్లు మంచి దేహశుద్ధే చేసారు.
ఈ ఘటన తర్వాత, వాళ్ళని ఎంతైనా దాడి చెయ్యనివ్వండి ఏం పరవాలేదు. కొందరంతే ప్రధానమంత్రి అవటానికి ఎంతకైనా తెగిస్తారు అన్నారు కేజ్రీవాల్.
కేజ్రీవాల్ మీద దాడి ఇది మొదటిసారి కాదు. హర్యానాలో, గుజరాత్ లో మహారాష్ట్రలో, ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోకూడా వివిధరకాలుగా దాడులు జరిగాయి. కారుని ధ్వంసం చెయ్యటం, మీద సిరా చల్లటం, కోడిగుడ్లు విసరటం, ఇప్పుడు ఏకంగా చెంప మీద కొట్టటం వరకు వెళ్ళింది.
ఈ ఘటన మీద ఇతర రాజకీయ పార్టీలను విమర్శించటానికి, మొక్కవోని తన సాహసాన్ని ప్రదర్శించటానికి కేజ్రీవాల్ కి పనికివస్తుందేమో కానీ, ఏ పార్టీయైనా ఇటువంటి అర్థం లేని దాడికి ఉసిగొలిపిందని అనుకోవటం మాత్రం సరికాదు. ఎందుకంటే దానివలన ఇతర పార్టీలకు ఏ ప్రయోజనమూ ఉండదు. అంతమంది మధ్యలో ఒక మనిషి వచ్చి చెంప మీద కొట్టటం వరకు చెయ్యగలడేమో కానీ అంతకంటే ఏమీ చెయ్యలేడు కదా. అలా జరగకుండా ఇంకా అప్రమత్తంగా ఉంటారేమో కానీ, ఆ మాత్రానికే భయపడి నామినేషన్ ని ఉపసంహరించుకుంటారని కూడా ఎవరూ అనుకోరు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more