కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2014 ఎన్నికలకు గాను మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ సమావేశంలో ప్రధాన మంత్ర మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ తదితర వరిష్ట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రణాళికను తయారు చెయ్యటంలో ఈసారి కొత్త పద్ధతిని అవలంబిస్తూ, అందరి అభిప్రాయలనూ సేకరించి తదనుగుణంగా రూపొందించమని సోనియా గాంధీ అన్నారు.
2009 లో చేసిన ఎన్నికల హామీల్లో 90 శాతం పూర్తిచేసామని రాహుల్ గాంధీ అన్నారు. పరిశ్రమల ద్వారానే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని కూడా ఆయన అన్నారు. నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన సిద్ధాంతం ఇద్దరు భారతీయుల మధ్య తగవు పెట్టే విధంగా ఉంటుందని, ఆయన ఒక వ్యక్తే అయినా, ఆయన ఆలోచనా సరళితో దేశంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కూడా రాహుల్ గాంధీ అన్నారు.
ముందు చూపుతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ లా కాకుండా అన్ని వర్గాలకూ అభివృద్ధి ప్రయోజనాలు కలిగేలా రూపుదిద్దామన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. వృద్ధిరేటు విషయంలో చూసుకుంటే ఎన్డీయే కంటే యూపిఏ అధికారం లో ఉన్నప్పుడే పెరిగిందని అన్నారాయన.
సోనియా గాంధీ చేసిన హామీలలో, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తామని, వెనకబడిన వర్గాలకు అండదండలు, ఉత్పాదనను పెంచటం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించటం ఉన్నాయి. వారణాసి నుండి కూడా ఎన్నికలలో పోటీ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమని, అయితే ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చెయ్యాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు సోనియా గాంధీ
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more