Chiranjeevi in congress bus yatra

Chiranjeevi in Congress bus yatra, APCC President Raghuveer Reddy, Rajyasabha Member Subbiramireddy, Anam Ramnarayana Reddy, JD Seelam

Chiranjeevi in Congress bus yatra, APCC President Raghuveer Reddy, Rajyasabha Member Subbiramireddy, Anam Ramnarayana Reddy

కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం, చిరు ఆశలు

Posted: 03/22/2014 12:24 PM IST
Chiranjeevi in congress bus yatra

శుక్రవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్ యాత్ర పార్టీలో కొంత ఉత్సాహం, చిరు ఆశలు నింపే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధి చిరంజీవి, నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని, కార్యకర్తలు అభిమానులే తమకి కొండంత అండ అని అన్నారు.  ప్రజారాజ్యం పెట్టినప్పుడు విశాఖపట్నం నుంచే పార్టీకి ఎక్కువ మద్దతు లభించిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి, అలాంటిది విశాఖ జిల్లా నాయకులు పార్టీని వీడిపోవటం దురదృష్టకరమని, తనకెంతో మనస్తాపాన్ని కలిగిస్తున్నదని అన్నారు. 

కాంగ్రెస్ ని బలహీన పరచటానికి మిగతా పార్టీలు చేస్తున్న కుట్రే తప్ప కాంగ్రెస్ కి ప్రజల అండదండలు, కార్యకర్తల వెన్నుదన్నులు అలాగే ఉన్నాయన్నారు చిరంజీవి.  శ్రీకాకుళం లో బస్ యాత్ర పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని కూడా చిరంజీవి ప్రజలకు వాస్తవాలను చెప్పటం, కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించటమే 13 జిల్లాలలో కాంగ్రెస్ చేసే బస్ యాత్ర ఉద్దేశ్యమని అన్నారు.

నాయకులు పార్టీని వదిలిపోయారు కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా చిరంజీవి సూచించారు. 

ఈ సందర్భంలో ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జెడి శీలం, సుబ్బిరామిరెడ్డి, తదితరులు పాల్గొని, కేంద్రంలో కాంగ్రెస్ రావటం తథ్యమని, సీమాంధ్రను తీర్చిదిద్దటం తప్పక జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరచారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles