తెలంగాణా జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితపై పవన్కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కవిత తననుద్దేశించి ‘పవన్ పార్టీ పెట్టొచ్చు కానీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఈనాడు దినపత్రికలో ఈరోజు చదివానని పవన్ అన్నారు. అయితే, తాను ప్రేమించే తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాలకు క్షమాపణ చెప్పాలా, వద్దా? అనేది తన వ్యక్తిగత విషయమని ఆయన స్పష్టం చేశారు.
అయితే తాను సారీ చెప్పాలని కవిత డిమాండ్ చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత.. తన సంస్థకు చెందిన నిధుల సేకరణకు సంబంధించి వివరాలను ఈ ప్రాంత ప్రజానీకానికి వెల్లడించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తనను విమర్శించే ముందు వీటికి సమాధానం చెప్పాలన్నారు. కవిత తనకు సోదరి వంటిదని, రేపటి రోజు చెల్లెమ్మ ఫ్యామిలీ తనను టార్గెట్ చేయడంలో తప్పలేదన్నారు.
శ్రీకాంతాచారి తల్లి వేదన:
తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. విడిపోయిన తర్వాత తెలుగువారి మధ్య చిచ్చు పెట్టొద్దని తెలంగాణ రాజకీయ నేతలకు ఆయన హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రకటించిన తరువాత శ్రీకాంతాచారి తల్లి వేదన తనకు కన్నీరు తెప్పించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.
కోట్లాది మందికి కోపం :
ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని విభజించిన తీరు సరిగా లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. విభజన తీరు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో కోట్లాది మందికి కోపం తెప్పించిందని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే తాను తెలంగాణ ఉద్యమాన్ని పది, పన్నెండు సంవత్సరాల నుంచి మాత్రమే గమనిస్తున్నానని... అయితే నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని గురించి తెలిసీ విభజనను సరిగా చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more