ఇది నిజంగా ఒక వింతే అని అంటున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి వింత జరిగి ఉండదని పెళ్లి కొచ్చిన బంధువులు అంటున్నారు. సహజంగా పెళ్లిలో అందరు ఆనందంగా ఉంటారు. కానీ ఇక్కడ పెళ్లిలో మాత్రం అందరు ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపంలో పెళ్లి పీటలపై వరుడు, వధువు కూర్చున్నారు.
పురోహితుడు వేదామంత్రాలు చదువుతున్నారు. మంగళవాయిద్యాలు మొగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పెళ్లి కూతురు భరించలేని నొప్పితో బాధపడుతూ కనిపించటంతో.. పెళ్లికొచ్చిన బంధువులు పెళ్లి కూతుర్ని .. పక్క గదిలోకి తీసుకెళ్లి, పది నిమిషాల తరువాత.. పండుంటి మగబిడ్డతో బయటకు వచ్చారు. ఇదేదో సినిమాలో జరిగిన సన్నివేశం కాదు. ఇది రియల్ లైప్ జరిగిన సంఘటన .
మద్యప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో జరిగిన సంఘటన. పెళ్లి మండపంలో మాన్ సింగ్ , దమయంతి పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు బంధవులు ఆశ్చర్యం, ఆవేశంతో, పెళ్లి ఆపేయండి కేకలు వేశారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం అందుకు నిరాహకరించాడు.
నేను దమయంతినే పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో.. కుల పెద్దలకు, బంధువుల కోపం కట్టలు తెంచుకోని రావటంతో ,దయమంతిని పెళ్లి చేసుకుంటే జరినామా కట్టాల్సి వస్తుందని చెప్పటం జరిగింది. అయితే మాన్ సింగ్ కులపెద్దలకు, కుటుంబ బంధువులకు భయపడకుండా.. ఆ జరినామా కట్టి, దమయంతిని తన భార్య చేసుకున్నాడు.
తన భార్యకు పెట్టిన మగబిడ్డను మాన్ సింగ్ తన చేతిలోకి తీసుకొని పెళ్లి కూతురు ఆనందంగా పెళ్లి మండపం దిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ సంఘాలు మాన్ సింగ్ చేసి పనికి మొచ్చుకుంటున్నాయి.
కట్టుకున్న మొగుడితో కాపురం చేసి బిడ్డల్ని కంటే. డిఎన్ ఏ టెస్ట్ చేయించుకోని కాపురం చేస్తున్న భర్తలు చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. అలాంటిది తన పెళ్లి మండపంలోని తల్లైన పెళ్లి కూతుర్నిమాన్ సింగ్ పెళ్లి చేసుకున్నందుకు మహిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more