సీమాంధ్ర ఆందోళనకారులను నియంత్రించటానికి ఢిల్లీ బలగాలు వీలైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఢిల్లీలోని మూడు మెట్రో స్టేషన్లను మూసివేసారు. ఉద్యోగ్ భవన్, సెంట్రల్ స్టేషన్, రేస్ కోర్స్ రోడ్ మెట్రో స్టేషన్లను మూసివేయటం ద్వారా మూకుమ్మడిగా దాడిచేసే అవకాశం ఉండదని భావిస్తూ ఆ చర్యలు తీసుకున్నారు. దీనితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అయితే దీని వలన తమ రాక అందరికీ తెలుస్తోందని, దేని కోసమైతే ఆందోళన చేస్తున్నామో ఆ అంశానికి జాతీయ స్థాయిలో అవగాహన పెరుగుతుందని సీమాంధ్ర ఆందోళనకారులు భావిస్తున్నారు.
ఎపిఎన్జీవోలు నిర్వహించిన ఆరు ప్రత్యేక రైళ్లలో చలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు ప్రత్యేక రైళ్ళలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.
ఆందోళన చేసేవారు ఏ వర్గానికి చెందినవారు, వారి ఉద్దేశ్యాలేమిటి, అందులో హింసలకు పాల్పడే నైజం ఉన్నవారున్నారా అన్న విషయంలో వాళ్ళు బయలుదేరిన జిల్లాల నుంచి ఢిల్లీ పోలీసులు ఆరాలు తీసినట్లుగా కూడా తెలుస్తోంది.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఈరోజు జరపనున్న సభకు రామ్ లీలా మైదాన్ లో ఏర్పాట్లు కూడా సమగ్రంగా పూర్తిచేసుకున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఈ రోజు రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. దీనికి పదిహేనువేల మంది హాజరవుతారని అంచనా. రాష్ట్రం నుంచి వెళ్ళినవారు రాత్రిపూట పడుకోవటానికి, తినటానికి కావలసిన ఆహార పొట్లాల ఏర్పాటు పూర్తిగా చేసుకుని సంసిద్ధంగా ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more