ప్రజాహితంలో నిర్ణయాలు తీసుకునే విధానానికి తిలోదకాలిచ్చినట్లే ఉన్నారు మన నాయకులంతా. ప్రధానమైన అంశం రాజకీయలబ్ధి మాత్రమే.
ఎంత త్వరగా అధికారంలోకి వచ్చిందో ఆమ్ ఆద్మీ పార్టీ అంతే త్వరగా దిగిపోయింది కూడా. అందుకు కారణం అడుగడుగునా అడ్డు తగిలిన కేంద్ర ప్రభుత్వమే. దేశ రాజధాని కావటంతో ఢిల్లీ మీద కేంద్ర ప్రభుత్వం అధికారం చెలాయిస్తూ వస్తోంది. ఇంత వరకు కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీ శాసనసభను కూడా శాసించటంతో రెండిటి మధ్యా పొరపచ్చలు రాలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవటంతో కేంద్రంతో శిగపట్లు మొదలయ్యాయి.
జాతీయ స్థాయిలో పట్టుకోసం జాగ్రత్తగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి చకచకా తీసుకుంటున్న చర్యలు దుందుడుకు చర్యలుగా కనిపిస్తూ కాంగ్రెస్ పార్టీకే కాకుండా భాజపా కూడా అడ్డుతగులుతున్న భావనలో ఉన్నట్టు కనిపించింది. రెండు పార్టీల మధ్య నలిగిపోతూ కూడా తాగు నీటి దగ్గర్నుంచి మొదలుపెట్టి, విఐపి సంస్కృతికి స్వస్తి చెప్పటం, అవినీతి మీద కొరడా ఝళిపిస్తూ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీద విచారణకు, ఇంకా ఇతర నాయకుల మీద కేసులు బుక్ చేయించటంతో ఈ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నట్టుగానే ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు.
జన్ లోక్ పాల్ బిల్లును ఢిల్లీ శాసన సభలో పెట్టిన కేజ్రీవాల్ ఆ ఘనత ఎక్కడ కొట్టేస్తాడో అని, ఆ బిల్లు సృష్టి కర్త అన్నా హజారే ఎక్కడ మద్దతు తెలుపుతారో అని తెగ ఆదుర్దా పడిపోయారు కాంగ్రెస్ భాజపాలు. దేశం అయితే నీది కాకపోతే నాది అంతే కానీ ఈ మూడో మనిషి ఎవరు మధ్యలో అన్న రీతిలో సాగాయి ఇరు పార్టీల ధోరణులు.
చివరకు అవకాశం దొరికింది. జన్ లోక్ పాల్ బిల్లు ఆర్థిక సంబంధిత బిల్లు కాబట్టి దాన్ని ముందుగా ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమోదం అవసరం అన్న మెలిక పెట్టారు. దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన లోక్ పాల్ బిల్లు కి ఈ జన్ లోక్ పాల్ విభేదిస్తోందన్న అంశాన్ని కూడా లేవనెత్తటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టానికి లోబడి రాష్ట్రాలు తమ చట్టాలను తయారు చేసుకోవచ్చు కానీ కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా కానీ లేదా అందులోని విషయాలను ఎక్కువ చేసి కాని చట్టాన్ని చెయ్యగూడదు. ఉదాహరణకు ఉద్యోగస్తుల గరిష్ట వయో పరిమితి 60 అని కేంద్రం చట్టాన్ని తీసుకునివచ్చిందనుకోండి, రాష్ట్రంలో దాన్నే పాటించవచ్చు లేదా దాన్ని 58 కాని 59 కాని చేసుకోవచ్చు కానీ 61 చెయ్యగూడదు. ఎందుకంటే 60 అన్నది కేంద్రం విధించిన పరిమితి కాబట్టి.
ఈ వంకతో జన్ లోక్ పాల్ ని ముందుగా కేంద్రం పరిశీలించి రాష్ట్రపతి ఆమోదించినట్లయితే అప్పడు తాను ఆమోద ముద్ర వేస్తానని లెఫ్టెనెంట్ గవర్నర్ అన్నారు. అంతేకాదు శాసన సభ స్పీకర్ కి ఆ బిల్లును ప్రవేశపెట్టవద్దని కూడా ఆదేశాలిచ్చారు. ఆ బిల్లుని ప్రవేశపెట్టనివ్వకపోతే రాజీనామా చేస్తానని బెదిరించిన కేజ్రీవాల్ అన్నంత పనిచేసారు. అయితే శాసనసభను రద్దు చెయ్యకుండా రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శాసనసభను రద్దు చేసినట్లయితే మళ్ళీ ఎన్నికలు జరపవలసివస్తుంది. అది ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన ఉండాలని నిర్ణయం తీసుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఈసారి ఢిల్లీ శాసనసభకు మళ్ళీ ఎన్నికలు జరిగితే కేజ్రీవాల్ పూర్తి మెజారిటీ కొట్టేసినా కొట్టెయ్యవచ్చన్నది కాంగ్రెస్ పార్టీ భయం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆఆపా ఎన్నికలు మళ్ళీ పెడితే ఎవరి మద్దతూ లేకుండానే గద్దెక్కవచ్చన్నది కొట్టిపారెయ్యలేని విషయం.
అందువలన రాష్ట్రపతి పాలనే శరణ్యమని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని అర్థం చేసుకోవటానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదేమో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more