Chandrababu write letter to president

Chandrababu write letter to President, Nara Chandrababu Naidu, Naidu writes to President on bifurcation, Chandrababu naidu, write a letter, President, Pranab Mukherjee, naidu write a letter to President Pranab Mukherjee

Chandrababu write letter to President, Naidu writes to President on bifurcation, naidu write a letter to President Pranab Mukherjee

మరోసారి కలం పట్టిన చంద్రబాబు

Posted: 11/23/2013 12:48 PM IST
Chandrababu write letter to president

రాష్ట్ర విభజనపై  కేంద్రం  దూకుడు పెంచింది. అతి త్వరలో  తెలంగాణ బిల్లు పాస్ చెయ్యటానికి ఢిల్లీ పెద్దలు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మేము సమైక్యాంద్ర కోసమే అంటూ.. దేశ యాత్రలు  చేస్తున్నారు. అయితే  తెలంగాణ పై ఇప్పటికి రెండు కళ్ల సిద్దాంతాన్ని  అవలంబిస్తున్న .. నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి.. ‘‘ముందు .. నుయ్యి.. వెనక గొయ్యి .. మద్యలో సమైక్యాంద్ర సెగ అన్నట్లుగా ఉందని  తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో రెండు  వర్గాల గోడలు వెలిసిన విషయం తెలిసిందే. అయితే   తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు .. చంద్రబాబు  తెలంగాణకు  అనుకూలంగా లేఖ ఇవ్వటం జరిగిందని  అంటున్నారు. 

 

సీమాంద్ర  తెలుగుదేశం తమ్ముళ్లు..  చంద్రబాబు రాసిన  లేఖలో.. రాష్ట్రాన్ని సమన్యాయం చేయమని చెప్పటం జరిగింది.   కాంగ్రెస్ పార్టీ మాత్రం  చంద్రబాబు లేఖ వలనే.. రాష్ట్ర విభజన జరుగుతుందని చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు  తన సొంత జిల్లా, సొంత ఊరు కుప్పంలో  యాత్ర సాగించారు. అయితే  అక్కడ ప్రజలు  చంద్రబాబు  పై సమైక్యాంద్ర ఒత్తిడి, సీమాంద్ర తెలుగుదేశం నాయకులు ఒత్తిడి పెంచటంతో.. చంద్రబాబు  మరోసారి  కలం పట్టడానికి సిద్దమైనట్లు  సమాచారం. ఈసారి  రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  చంద్రబాబు మరో లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. లేఖ ప్రతితో నేరుగా రాష్ట్రపతిని కలిసే యోచనలో సీమాంధ్ర టీడీపీ నేతల బృందం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు మరోసారి లేఖ ద్వారా రాష్ట్రపతికి ఏం చెబుతారో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles