గత కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటనలో 45 మంది సజీవ దహనం అయిన సంఘటన మరవక ముందే కర్ణాటకలో మరో వోల్వో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏగుడురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లి వద్ద వర్దా నదిని దాటిన తర్వాత రోడ్డు డివైడర్ ను ఢీకొనడం బస్సు టైరు పేలడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 7గురు సజీవ దహనం కాగా, మరో 25 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ సంఘటనలో గాయపడ్డ వారిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉండగా, ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు బస్సులు అద్దాలు పగల కొట్టి బయటకి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. నిన్న సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలు దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్టు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 140 నుండి 150 వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ సంఘటన పై కర్ణాటక ముఖ్యమంత్రి విచారణ కు ఆదేశించారు. డ్రైవర్ల నిర్లక్ష్యమో, ఆర్టీఏ అధికారుల నిద్ర మత్తో కానీ అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నది మాత్రం నిజం. ఇప్పటికే జరిగిన రెండు సంఘటనలతోనైనా అధికారులు మేల్కొని వ్వోల్వో బస్సుల ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more