లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ముందు 13 మంది సీమాంద్ర ఎంపీలు పెయిల్ అయ్యారు. అంటే వీరు ఏదో పరీక్ష రాసి కాదులేండి. వీరు చేసిన ఘనకార్యం.. వినటానికి బాగుంటుంది కానీ, చూస్తేనే కంపుకొడుతుంది. సీమాంద్ర ఎంపీలు రాజీనామలు చేయటంలో కూడా ఫెయిల్ అయ్యారు. అంటే సీమాంద్ర ఎంపీలకు రాజీనామాలు చేయటం కూడా రాదని మీరు మాత్రం అనుకోండి. ఎందుకంటే.. సీమాంద్ర ఎంపీలు.. సమైక్యాంద్ర కోసం ఎంతో చిత్తశుద్దితో చేయటం జరిగింది. కానీ ఎక్కడో చిన్నలోపం ఉండి ఉంటుంది. ఆ లోపం ఎక్కడ జరిగిదో మనకూడా తెలుసుకుందాం..
ఇదిగో..మేము సమైక్యాంద్ర కోసమే రాజీనామాలు చేస్తున్నాం అని.. మీడియా ముందు గొప్పలు చెప్పటం జరిగింది. అయితే రెండు నెలల తరువాత వారి చేసిన రాజీనామాల రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు.
వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు.
రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు
1. రాయపాటి సాంబశివరావు
2.కనుమూరి బాపిరాజు,
3.ఉండవల్లి అరుణకుమార్
4.వై.ఎస్.జగన్మోహన్రెడ్డి,
5.మేకపాటి రాజమోహన్రెడ్డి,
6.లగడపాటి రాజగోపాల్
7.అనంత వెంకట్రామిరెడ్డి,
8.ఎ.సాయి ప్రతాప్,
9.జి.వి.హర్షకుమార్,
10.మాగుంట శ్రీనివాసులు రెడ్డి,
11.సబ్బం హరి,
12.కొనకళ్ల నారాయణరావు,
13. ఎస్.పి.వై.రెడ్డి
స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more