వేములవాడ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్న రమేష్ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునిచ్చింది. తప్పుడు పౌరసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చారని అందుకే ఈ ఎన్నిక చెల్లదని, రమేష్ ఈ దేశపౌరుడు కాదని ఆరోపిస్తూ,ప్రత్యర్ధిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కోర్టులో వేసిన పిటీషన్ పై ఈ తీర్పు వెల్లడించింది. రమేష్ ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. రమేష్ గతంలో జర్మనిలో నివసించి ఉద్యోగం చేసేవారు. అక్కడి నుండి వచ్చి టీడీపీ లో చేరి వేముల వాడ శాసనసభ సభ్యుడిగా గెలుపొంది, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచాడు. మరో కొద్ది నెలల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో ఈ తీర్పు ఇఛ్చినా పెద్ద ఉపయోగం ఏమి లేదేమో ?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more