తూర్పుగోదావరి జిల్లా - రాజమండ్రి – ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఐసిడిఎస్ లోని 55 అంగన్ వాడి కేంద్రాలలోని సిబ్బంది, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగటానికి ఏకగ్రీవ తీర్మానానికి వచ్చారు. రావులపాలెం – రైతులు రాస్తా రోకోలో అరటి గెలలతో దిగ్బంధం చేసి ఆందోళన చేసారు.
విశాఖపట్నం – విద్యార్థులు విశాఖపట్నంలో ఈ రోజు భారీ ర్యాలీని చేపట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీ బయలుదేరగా కెజిహెచ్ వైద్యులు విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేసారు.
కృష్ణా గుంటూరు జిల్లాలలో కేబుల్ ఆపరేటర్లు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ళ ప్రసారాలను ఈ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేసారు. దుగ్గిరాలలో పసుపు మార్కెట్ అధికారులు క్రయ విక్రయాలను నిలిపివేసారు.
నెల్లూరు జిల్లా – వెంకటగిరిలో ఆర్ టి సి కార్మికులు ఆందోళన చేపట్టి క్రాస్ రోడ్ దగ్గర అద్దెబస్సులను రోడ్డుకి అడ్డంగా నిలిపి నినాదాలు చేస్తూ ట్రాఫిక్ కి అవరోధం కలిగించారు.
అనంతపూర్ జిల్లా – జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి 12 రోజులుగా ఆందోళన బాట పట్టిన సమైక్య మద్దతుదారులు ఈ రోజు కూడా కొనసాగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా – ఏలూరులో ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతూనేవున్నాయి. అర్ టి సి బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. జ్యూట్ మిల్ కార్మికులు విధులను బహిష్కరించారు. చాలా చోట్ల బంద్ లు స్వచ్ఛందంగా పాటించటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more