Hyderabad residents belong to telangana

Hyderabad residents belong to Telangana, Damodara Raja Narasimha, Kirana Kumar Reddy, Jaipal Reddy, Telangana Journalist Forum, Nation River Waters Board

Hyderabad residents belong to Telangana

హైద్రాబాద్ వాసులు తెలంగాణా వాళ్ళే

Posted: 08/09/2013 04:10 PM IST
Hyderabad residents belong to telangana

తెలంగాణ జర్నలిస్ట్ ల ఫోరంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళంతా తెలంగాణా వాళ్ళేనని, సెటిలర్లు కారని అన్నారు.  విద్య, ఉద్యోగరంగాలలో తెలంగాణాలో అన్యాయం జరిగిందని, వరసగా జరుగుతూనేవుందన్నారాయన.  అందుకే ఇదివరకటి తెలంగాణాను తాము కోరుకోవటం జరిగిందని చెప్పారు.  

నదీ జలాలు, విద్యుత్ వాటాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదని, దాని విషయం చూసుకోవటానికి కమిటీలు ఉంటాయని అన్న రాజనరసింహ, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే చరిత్రలో మిగలరని అన్నారు.  
రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు వస్తాయని అన్న ముఖ్యమంత్రి మాటలను ఆయన ఖండించారు.

ఈ విషయంలో మహబూబ్ నగర్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా, నదీజలాల విషయం చూసుకోవటానికి జాతీయ జలాల బోర్డుందని అన్నారు.  అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయమిక శిలాశాసనమేనని మారబోదని కూడా గట్టిగా చెప్పారు జైపాల్ రెడ్డి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles