మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రాజీనామాలు చేసి కేంద్రం పై ఒత్తిడి తేస్తే... ఈ అంశం పై అటో ఇటో తేల్చడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు రాజీనామాల బాట పట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరా శివారెడ్డి రాజినామా చేస్తే వారికి పోటీగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్నాథ్ రెడ్డి(అనంతపురం), బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు), శోభా నాగి రెడ్డి(ఆళ్లగడ్డ), మేకపాటి చంద్రశేఖర రెడ్డి(ఉదయగిరి), నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(నెల్లూరు), అమర్నాథ్ రెడ్డి(రాజంపేట), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి)లు రాజీనామా చేశారు. వారు స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామాలను ఫ్యాక్స్ చేశారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఇదే పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నాయకులు రాజీడ్రామాలు ఆడుతున్నారని, కొంత మంది లబ్ది కోసం రాయల సీమ రాష్ట్రం కావాలని, రాయల సీమను విభజించే హక్కు ఎవరిచ్చారని అయన మండి పడ్డారు. తెలంగాణ ఇస్తామంటే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు, అధిష్ఠానం చెప్పిన మాట వింటామని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఇవన్నీ డ్రామాలేనని రాష్ట్రం సమైక్యంగా ఎండటానికి ఎంత సాహసమైనా చేస్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మరి ఇంత వరకు ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పిని వైకాపా సమైక్యాంద్రకే మద్దతు ఇస్తుందని వీరి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more