1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా ఉద్యమించి నరమేధాన్ని సృష్టించిన కేసులో ఇంతకాలం తప్పించుకున్న సజ్జన్ కుమార్ తన మీద ట్రయల్ కోర్టు లో నడుస్తున్న కేసుని ఉపసంహరించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఈ రోజు హైకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. దానితో సిక్కు సంఘాలు ఆనందాన్ని ప్రకటించాయి. అంతకుముందు ఇలాంటి మరోకేసులో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నా లోయర్ కోర్టు సజ్జన్ కుమార్ ని నిర్దోషిగా తీర్పునివ్వటంతో బాధిత సిక్కు కుటుంబాలు మనస్తాపానికి లౌనై, కోర్టు నుంచి బయటకు కూడా వెళ్ళమంటూ కాస్సేపు నిరసన చూపించారు.
ఆ తర్వాత జస్టిస్ జి.టి. నానావతి కమిషన్ సిఫార్స్ మీద సిబిఐ విచారణను చేపట్టి సజ్జన్ కుమార్ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ విచారణను నిలిపివేయాలంటూ సజ్జన్ కుమార్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
అక్టోబర్ 31, 1984లో ఇందిరా గాంధీ హత్య దరిమిలా, ఢిల్లీలోని సుల్తాన్ పుర్ లో ఆరుగురు సిక్కులను దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జన్ కుమార్, వేద్ ప్రకాశ్ పయ్యల్ మీద లోయర్ కోర్టులో కేసు దాఖలవగా, సజ్జన్ కుమార్ తన మీద విచారణను తొలగించాలంటూ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఆయనతో పాటు పయ్యల్ కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
ఇప్పటికే ఏప్రిల్ 29, మే 24 రెండు సార్లు నిర్ణయాన్ని వాయిదా వేసిన జస్టిస్ సురేశ్ కైట్ ఈరోజు సజ్జన్ కుమార్ అప్పీల్ ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో బాధిత సిక్కు కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేసినా ఇంకా ట్రయల్ కోర్టులో చాలా తంతు ఉందిగా అంటూ నిట్టూర్పులు విడిచారు. 29 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగటం లేదంటూ విచారాన్ని వ్యక్తం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more