రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు పై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. రీసెంట్ కిరణ్ కిరణాలకు బలైన వారిలో మంత్రుల్లో ఢీఎల్ రవీంద్ర రెడ్డి ఒకరు. ఢిఎల్ రవీంద్ర రెడ్డి ని మంత్రి పదవి నుండి తొలగించటం పై కొంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై వ్యతిరేక ప్రకటనలు చేసే వారిపై సీఎం కిరణ్ వేటు వేయటంలో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై కొంత మంది మంత్రులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే.
వీరికి సపోర్టుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉండటంతో ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడిక్కినట్లు సమాచారం. ఈరోజు మంత్రి చిరంజీవి , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య ఏకంగా 45 నిమిషాల పాటు చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ భేటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని డిస్మిస్ చేస్తూ కిరణ్ తీసుకున్న నిర్ణయంపై నలువైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ చర్యను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు.. మరో మంత్రి జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంలోనే చిరు వర్గానికి చెందిన దేవాదాయ శాఖామంత్రి సి. రామచంద్రయ్యపై కూడా డిస్మిస్ వేటు చేయనున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోనియాతో చిరంజీవి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more