Political news minister raghuveera reddy new statement

minister raghuveera reddy, congress party, minister raghuveera reddy meet botsa satyanarayana, anam ramnarayana reddy, dl ravindra reddy, cm kiran kumar reddy , indiramma bata,

minister raghuveera reddy new statement

సీఎంపై మాకు నిరాశ లేదు?

Posted: 05/06/2013 03:47 PM IST
Political news minister raghuveera reddy new statement

ఇటీవల కాలంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై.. కొంత మంది మంత్రులు వార్ ప్రకటించారు. నిరాశతో రగిలిపోతున్న మంత్రులు, అమ్మకు కిరణ్ కుమార్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  వ్యతిరేక వర్గం మంత్రులు  ముఖ్యమంత్రి పై దండెత్తిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు కొంతమంది మంత్రులు సీఎంకు సపోర్టు గా మాట్లాడుతున్నారు.  వ్యతిరేక వర్గానికి  నాయకుడిగా వ్యవహారించి పీసీసీ బొత్స సత్యనారాయణతో  మంత్రి  రఘువీరా రెడ్డీ  సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి  ఆనం రాంనారాయణ రెడ్డి, మరో సీనియర్ మంత్రి డీఎల్  భేటి అయ్యారు.  

ఈ సమావేశంలో .. ముఖ్యమంత్రి పై జరిగినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ  రఘువీరా రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి విషయంలో  ఎలాంటి అసంత్రుప్తి లేదని  రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అయితే  రఘవీరా రెడ్డి వ్యాఖ్యలపై  బొత్స,  డిఎల్  రవీంద్ర రెడ్డి మండిపడుతున్నారు.  మంత్రులకు చెప్పకుండా .. ముఖ్యమంత్రి సొంతగా పథకాలను  ప్రవేశపెడుతున్నారు. దీనిపై డీఎల్ , బొత్స విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో రఘువీరా రెడ్డి వ్యాఖ్యలు  ముఖ్యమంత్రికి సపోర్టుగా ఉన్నాయని  వ్యతిరేక వర్గం మంత్రులు అంటున్నారు.  ఇవేమీ పట్టించుకోని .మంత్రి రఘువీరా మరో ప్రకటన చేశారు. ఈ నెల 25న అనంతపురంలో ముఖ్యమంత్రితో కలిసి ఇందిరమ్మ బాట ఉంటుందని ఈ కార్యక్రమానికి అందరు మంత్రులు వస్తారని ఆయన చెప్పటం జరిగింది. ఈ విషయం పై సీఎం కు వ్యతిరేక వర్గంలో చర్చలు జరుగుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles