తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలో తెలంగాణ కోసం ఓ వైపు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి, మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమ గళం వినిపిస్తున్నారు. ఐకాస సత్యాగ్ర దీక్షకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ తదితర పార్టీలు మద్దతు పలికాయి. బిజెపి నేతలు ప్రకాష్ జవదేకర్, ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, లెఫ్ట్ నేతలు గుండా మల్లేష్, చాడ వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణపై అధికార కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణపై తేల్చాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. పార్లమెంటు గేటు వద్ద ఎంపీలు మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు గేటు 1 వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెసు పార్టీ తెలంగణపై తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటిదాకా తాము తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ ఆందోళనలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. వారికి భాజపా, తెరాస మద్దతు పలికింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more