చిన్నపిల్లల సంక్షేమం కోసమే ఏర్పడ్డ యూనిసెఫ్ ఢిల్లీలో ఐదు సంవత్సరాల బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి నేరాలకు శిక్షలు కఠినంగా ఉండాలని కోరింది.
భారతదేశంలో ఇళ్ళల్లో కానీ బళ్ళల్లో కానీ, వీధుల్లో కానీ, పనిచేసే స్థలాల్లో కానీ చిన్న పిల్లలు, మహిళలు భయం లేకుండా ఉండగలిగే పరిస్థితిని ఏర్పాటు చెయ్యటం తక్షణమే చేపట్టాలన్న విషయం, విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ బాలిక ఉదంతం స్పష్టం చేస్తుందంటూ యూనిసెఫ్ ఢిల్లీ శాఖ ఘాటుగా స్పందించింది.
అత్యాచారాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, యూనిసెఫ్ 2011 లో ఇండియాలో పిల్లల మీద 30000 నేరాలు జరిగాయని, అందులో మూడో వంతు అత్యాచారం కేసులేనని చెప్పింది. సంవత్సరంలో 7200 బాలికలు అందులోనూ చిన్నపిల్లలు అత్యాచారానికి గురౌతున్నారన్న డేటా వేదనను కలిగిస్తోంది ఎందుకంటే రిపోర్ట్ చెయ్యని కేసులు ఇంకా ఉండవచ్చు కాబట్టి అని యూనిసెఫ్ ప్రకటించింది.
ఢిల్లీలో కదులుతున్న బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత కూడా భారతదేశం చట్టాలలో తగు సవరణలు చెయ్యలేకపోయిందని యూనిసెఫ్ విమర్శించింది. తగు చట్టాలే కాదు వాటిని సమర్ధవంతంగా అమలు పరచటం ముఖ్యమని కూడా యూనిసెఫ్ సూచించింది. ఈ వారంలో జరిగిన అత్యాచారం సంఘటన కూడా చట్టాన్ని అమలుపరచే శాఖలు ఇంకా ఎక్కువగా బాధ్యతాయుతంగా పనిచెయ్యాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాయని కూడా యూనిసెఫ్ చెప్పటం జరిగింది.
మేము మా అభిప్రాయంగా దీనికి జోడిస్తున్నదేమిటంటే, చట్టాలను కఠినతరం చెయ్యటం వాటిని సమర్ధవంతంగా అమలుపరచటంతో పాటుగా యువతలోని మానసికమైన ఈ బలహీనత పోగొట్టే దిశగా కూడా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చెయ్యాలి. ఈ విషయాన్ని లోగడ కొన్ని వార్తా కథనాల్లో రాయటం జరిగింది. మలేరియా నిర్మూలన, ఎయిడ్స్ గురించి అవగాహన కోసం ప్రణాళికాబద్ధమైన ప్రచారాలు జరిగినట్లుగానే అత్యాచారమనే మానసిక బలహీనతను యువత మెదడ్లలోంచి తీసేసే ప్రణాళిక కూడా చాలా అవసరం. శారీరకంగా ఎదగని వాళ్ళ మీద అత్యాచారమంటే అది ఆ నేరస్తుల మానసికంగా ఎదగని స్థాయిని, లేదా వక్రదిశగా ఎదిగిన విషయాన్ని తెలియజేస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more