5 dead and 14 injured in overturned tractor

chief minister of ap, kiran kumar reddy, tekkali, srikakulam dist, accident in ayodhyapuram

5 dead and 14 injured in overturned tractor

సిఎమ్ సమావేశం నుంచి తిరిగివస్తూ మృత్యువాత

Posted: 04/17/2013 08:50 AM IST
5 dead and 14 injured in overturned tractor

శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిర్వహించిన సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో టెక్కలి మండలం అయోధ్యాపురంలో ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు.  అందులో నలుగురు మహిళలున్నారు.  మరో 14 మంది గాయాలుతగిలి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

సభ బాగా జరిగిందని ఎక్కువమంది హాజరైనారని ముఖ్యమంత్రి ఇతర నాయకులకు ఈ వార్త దిగ్భ్రాంతి కలిగించింది.  మధ్యాహ్నం 1.15 వరకు జరగాల్సిన సమావేశాన్ని, అందరూ ఇళ్ళకు త్వరగా చేరుకోవటం కోసం 1245 కే ముగించారు. 

ట్రాక్టర్ ఓవర్ లోడ్ అవటం వలనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మగతా మంత్రులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  తర్వాత హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నవారిని పరామర్శించారు.  చనిపోయినవారి కుటుంబీకులకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles