దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్ ను ఉరితీయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ సమావేశమయ్యారు. భుల్లార్ కు ఉరిశిక్ష అమలు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పంజామ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ , ఉప ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కు వివరించారు. 1993లో ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడి కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భుల్లార్ క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రిం కోర్టు గత వారంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. 1993 సెప్టెంబరులో ఇక్కడ భుల్లార్ బాంబు పేల్చి 9 మంది మరణానికి మరో 25 మంది గాయపడడానికి కారకుడయ్యాడని భుల్లార్కు మరణ శిక్ష విధించడమైంది. దీనిపై భుల్లార్ అపీలు చేసుకోగా 2002 మార్చి 26న సుప్రీం కోర్టు రద్దు చేసింది. తరువాత భుల్లార్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కూడా 2002 డిసెంబరు 17 న రద్దు చేశారు. దాంతో క్యూరేటివ్ పిటిషన్ భుల్లార్ దాఖలు చేయగా అది కూడా 2003 మార్చి 12న తిరస్కరింపబడింది. కోర్టులు మరణ శిక్షలను విధించినప్పటికీ గత ఎనిమిదేళ్లుగా గత ఏడాది నవంబరు వరకు అమలు కాక పెండింగ్లో ఉంటున్నాయి. 2008 ముంబై దాడుల కేసుకు సంబంధించి మాత్రమే నేరస్తునికి గత ఏడాది నవంబరులో ఉరి శిక్ష అమలు చేశారు. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి సంబంధించి మరో ఉగ్రవాదికి మరణ శిక్ష పడింది. దయాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థించినా ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఫిబ్రవరిలో మరణ శిక్ష అమలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత ఏడాది జులైలో పదవిని గ్రహించిన తరువాత క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరిస్తూ మరణ శిక్ష అమలుపై కఠినంగా ఉంటున్నారు. దేశంలో 400 మందికి పైగా ఇప్పుడు మరణ శిక్ష వరుసలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more