విద్యత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వామపక్షాలు చేసిన బంద్ పిలుపుకి మిగిలిన విపక్షాలు కూడా మద్దతునివ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హైద్రాబాద్ ఎల్ బి నగర్ లో వామపక్షాలు, తెదేపా కార్యకర్తలు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి టైర్లలోని గాలి తీసివేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంతవరకూ ఈ ఆందోళన ఆగదని ప్రకటించారు.
హైద్రాబాద్ లో హయత్ నగర్, ఉప్పల్, ముషీరాబాద్ డిపోల ముందు, విజయవాడలో నెహ్రూ బస్ స్టేషన్, విద్యాధరపురం, గవర్నర్ పేట, ఆటోనగర్ బస్సు డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. ఇంకా కడప, కర్నూలు, నెల్లూరు, కరీం నగర్, గోదావరిఖని, హుజూరాబాద్, సిరిసిల్ల, కోరుట్ల, వరంగల్, జనగాం, మెహబూబాబాద్ బస్సు డిపోలలో కొన్నిటికి తాళాలు కూడా వేసి గేటు ముందు బైఠాయించి ఆందోళనకారులు ఆందోళనలు చేస్తున్నారు. నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నా ఇంకా దీనితో వేలాది బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి.
ఖమ్మంలో బంద్ ప్రశాంతవాతావరణంలో జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బంద్ కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాలోని 9 డిపోలలో దాదాపు 900 బస్సలు నిలిచిపోయాయి. విజయనగరం రైల్వే స్టేషన్లో బొకారో ఎక్స్ ప్రెస్ ని నిలిపి వేసి తెదేపా నేతలు ఆందోళన చేసారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో వామపక్షాలతో పాటు తెరాస, భాజపా, వైకాపా, తెదేపా కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. బంద్ దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ముందుగానే బస్సులను డిపోలో నిలిపివేసారు.
అనంతపురం జిల్లాలో 11 డిపోలలో మొత్తం 1300 బస్సులు నిలిచిపోయాయి. తెదేపా కార్యకర్తలు బస్సు డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో విద్యా వ్యాపార సంస్థలను ముందుగానే మూసివేసారు.
మొత్తానికి విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా చేస్తున్న బంద్ అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో విజయం సాధిస్తోంది. ఈ రోజు మాత్రమే కాదని, ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే బంద్ ఇంకా కొనసాగుతుందని నేతలు చెప్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more