ఎక్కువౌతున్న అత్యాచారాలు, వాటితో పాటే ఎక్కువౌతున్న సందిగ్ధాలు.
అమృత్ సర్ లో బస్ స్టాండ్ లో ఉన్న 22 సంవత్సరాల అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్ళి నగరంలో 45 నిమిషాలపాటు తిప్పుతూ నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి, చివరకు ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు సెల్యూలర్ ఫోన్ కంపెనీ ఉద్యోగి. జరుగుతున్న విషయం బయటకు తెలియకుండా ఉండటం కోసం కారులో స్టీరియోని ఆ సమయంలో బిగ్గరగా పెట్టారట.
నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలియజేసారు. ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో ఆమెను చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె శృంగారంలో పాల్గొన్నట్టుగా తేలుతున్నది కానీ ఆమె శరీరం మీద బలవంతంగా దాడి జరిగిన గుర్తులేమీ లేవని తెలిసింది.
ఈ సంఘటన జరగటానికి ముందు, ఆ తర్వాత కూడా ఆమె సెల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయని, నిందితులు బాధితురాలికి తెలిసినవాళ్ళేనని అనిపిస్తోందని, దర్యప్తు ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలియజేసారు.
బస్సులో విషయం వేరు కానీ నడుస్తున్న కారులో ప్రయాణం చేస్తున్నవారు సీట్లు మారటం అంత తేలిక కాదు. పైగా స్టీరియో బిగ్గరగా పెట్టటం వలన అది అందరి దృష్టినీ ఇంకా ఆకర్షిస్తుంది. అంతేకాదు, లోపల శబ్దాలు బిగ్గరగా ఉన్నప్పుడు లోపలి వాళ్ళు ఇంకా బిగ్గరగా మాట్లాడుకోవలసి వస్తుంది. అప్పుడు అవన్నీ బయటకు వినపడతాయి. ఆమె నిజంగా కేకలు వేసుంటే ఆ కేకలు లోపలివాళ్ళకి ఆ శబ్దంలో వినపడవు కానీ బయటకు చాలా బాగా వినిపిస్తాయి. ఇవన్నీ అనుమానాలను రేకెత్తించే విషయాలు. అయితే ఆడవాళ్ళు ఇటువంటి కేసుల్లో అసలు ఫిర్యాదులు చెయ్యటానికే జంకుతుంటారు కాబట్టి, ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, అత్యాచారం జరిగిందిన ఆరోపించినప్పుడు అది జరిగిందనే విషయాన్ని నిరూపించవలసిన బాధ్యత (ఓనస్) బాధితురాలి మీద కాక ఆరోపణలను ఎదుర్కుంటున్నవారిమీద ఉంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more