నగరంలోని దిల్సుఖ్నగర్లో గురువారం సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. బాంబు పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు హాహాకారాలు చేస్తూ అటు ఇటు పరుగులు తీయడంతో త్రొక్కిసలాట జరిగింది. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై రాష్ట్రమంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. బాంబు పేలుడు గురించి తెలిసిన వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలలో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ దిల్షుక్నగర్లో వరుస పేలుళ్లు సంభవించడంతో పోలీసులు నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. కోణార్క్ థియోటర్ వద్ద ఒక సైకిల్కు టెర్రరిస్టులు బాంబును అమర్చినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఒక హీరో హోండాలో గల మరో బాంబు పేలింది. ఈ సంఘటన పై వివరాలను తెలుసుకునేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి వివరాలు తెలుసుకుంటున్నారు. మరో వైపు ఈ సంఘటన పై ఢిల్లీ నుండి ప్రధాని, సోనిమా, కేంద్రహోంమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ సంఘటన పై వారు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై షిండే ప్రకటన చేశారు. ఈ పేళుళ్లలో 20 చనిపోయారని, యాభై మంది గాయపడ్డారని హోంమంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ ఘటన పై ఆయన ప్రధానికి వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఇంకా మరేమైనా సున్నిత ప్రాంతాలు ఉన్నాయా, మరెక్కడైనా ఇంకా బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందా అని చాలా జాగ్రత్తగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more