ఎన్టీఆర్ విగ్రహం పై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న బాలయ్య బహిరంగ లేఖతో దగ్గుబాటి దంపతులపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దాని కేంద్రమంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ...పార్లమెంట్లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో సోదరుడు, టాలీవుడ్ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. బాలయ్య తన ఇంటికి వచ్చారని, అందరం కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిద్దామని అన్నారని, అయితే తన సంతకం కోసం రాలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. అయితే తన సంతకం లేకుండానే స్పీకర్కు వినతి పత్రం సమర్పించారని మంత్రి తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫోన్ చేసి మాట్లాడగా అలా మాట్లాడలేదని బాలయ్య చెప్పినట్లు ఆమె తెలిపారు. సంతకం కోసం ఇంటికి రాలేదని కూడా చెప్పినట్లు పురందేశ్వరి అన్నారు. పార్లమెంటులో ప్రతిష్టాపనకు తాను ఒక్కదాన్నే విగ్రహం ఇవ్వాలని గానీ, ఆ కీర్తిని తాను మాత్రమే కొట్టేయాలని గానీ అనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. బాలయ్య తనకన్నా చిన్నవాడని, తనపై చేసిన వ్యాఖ్యలను బాలయ్య విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. వివాదానికి తాను కారణం కాదని, వివాదం ఎందుకు చోటు చేసుకుందో దాన్ని సృష్టించినవాళ్లనే అడగాలని ఆమె అన్నారు. అసలు వివాదమే లేదని పురందేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి కూడా తాను మూడు సార్లు లేఖను పంపించానని, అది తీసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరనే సమాధానం వచ్చిందని ఆమె అన్నారు. తాను ఒక్కదాన్నే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా అందరూ భాగస్వాములు కావాలి, కలిసి చేద్దామనే మాట మీద తాను నిలబడుతున్నానని ఆమె అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more