నైజీరియాలో ఉన్మాదులు నెత్తుటేరులు పారించారు. ముబీ పట్టణంలోని అడమవా స్టేట్ యూనివర్సిటీ హాస్టళ్లలోకి రాత్రి సైనిక దుస్తుల్లో చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 46 మంది మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. దేశ 52వ స్వాతంత్య్ర దినోత్సవాన ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులు హాస్టళ్లలోకి ప్రవేశించిన అనంతరం విద్యార్థులను పేర్లు చెప్పాలని అడిగారని, తర్వాత వారిలో కొంతమందిని వదిలేసి తక్కినవారిపై కాల్పులు జరిపారని ఒక లెక్చరర్ వెల్లడించారు. వారు తుపాకులు, కత్తులతో దాడి చేశారన్నారు. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో తెలియరాలేదు. కాగా, ఈ ప్రాంతంలో ‘బొకో హరమ్’ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ తరచూ దాడులు చేస్తూ ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతిని నిరసిస్తూ ప్రజలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి.. షరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా ఈ సంస్థ దాడులకు పాల్పడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more