Rajiv gandhi international airport shamshabad

Rajiv Gandhi International Airport, Shamshabad

Rajiv Gandhi International Airport, Shamshabad

Shamshabad.gif

Posted: 08/21/2012 01:20 PM IST
Rajiv gandhi international airport shamshabad

Rajiv Gandhi International Airport, Shamshabad

శంషాబాద్ విమానాశ్రయం ఇకమీదట మరింత బిజీబిజీగా మారనుంది. కనీసం మరో అర డజను విదేశీ విమాన సంస్థలు త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. చౌక చార్జీల టైగర్ ఎయిర్‌వేస్‌తో పాటు థాయ్ స్మైల్ కూడా వచ్చే నెలలో శంషాబాద్‌కు రానుంది. ఇక ఆఫ్రికాలో బాగా పేరున్న కెన్యా ఎయిర్‌వేస్, ఇండోనేషియా అధికారిక విమానయాన సంస్థ గరుడ కూడా భాగ్యనగరానికి రావడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి సిల్క్ ఎయిర్ సంస్థ హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానాలు నడుపనుంది. ఇలా నడిపే సంస్థల్లో ఇది రెండోది. విమానాశ్రయ వర్గాల రికార్డుల ప్రకారం ఈ మార్గంలో ఏటా 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాగే థాయ్‌లాండ్‌కు ఇక్కడి ప్రయాణికులు ఎక్కువే. థాయ్‌స్మైల్ రాకతో మరింత మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ సంస్థకు చెందిన మొదటి విమానం శంషాబాద్ నుంచి ఎగరబోతోంది.దట్టమైన అడవులు, ఆహ్లాదకరమైన ప్రాంతాలతో కూడిన ఆఫ్రికన్ దేశాల్లో పర్యటనలకు ముచ్చట పడని వారుండరు.

హైదరాబాదీ పర్యాటకులకు వల వేయడానికి కెన్యన్ ఎయిర్‌వేస్ సిద్ధమవుతోంది. 2014 నాటికి ఈ సంస్థ ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రా రంభిస్తుందని అంచనా. త్వరలో 7875 తరహా విమానాలు ఒక డజ ను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇవి తమ చేతికి వచ్చాయంటే హైదరాబాద్‌తో సహా ఆరు నగరాల్లో వీటిని నడుపుతామని కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన ఏరియా మేనేజర్ బెన్నెట్ స్టీఫెన్స్ తెలిపారు.ఆఫ్రికన్ పర్యాటకుల సంఖ్య ఏటా 30-35% చొప్పున పెరుగుతోంది. పెద్ద పెద్ద ఐటీ సంస్థలు బోట్స్‌వానా, కెన్యా లాంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటుండటంతో అక్కడకు తరచు వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికితోడు ఆఫ్రికా దేశాలలో వ్యవసాయానికి మన రైతులు ఉత్సాహం చూపడం కూడా ప్రయాణికుల సంఖ్యను పెంచుతోంది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోడానికి కెన్యా ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉందని 'వన్‌స్టాప్ హాలీడేస్' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీర్ లియాఖత్ అలీ తెలిపారు. ఇండోనేషియన్ ఎయిర్‌లైన్స్ గరుడ సైతం శంషాబాద్‌కు క్యూ కడుతోందని ఆయన తెలిపారు. వీటితో పాటు యూరోపియన్ ఎయిర్‌లైన్స్, జెట్‌స్టార్ ఏషియా, మయన్మార్ ఎయిర్‌వేస్ వంటి పలు సంస్థలు త్వరలో హైదరాబాద్‌కు జై అంటాయని ఇటీవలే సెంటర్ ఫర్ ఏసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) 2012-13 నివేదిక తెలిపింది. ఇప్పటికే శంషాబాద్ నుంచి 10 విదేశీ ఎయిర్‌లైన్స్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి కొత్త సంస్థలు తోడైతే శంషాబాద్ బిజీగా మారిపోవడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr visits childhood friend for ramzan
Sachin tendulkar his family a must watch movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles