ఎప్పటినుంచో ఊరిస్తున్న సర్కారీ సూపర్బజార్లు త్వరలోనే రానున్నాయి. కేరళ తరహాలో వీటిని ఏర్పాటు చేసి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. దీనిపై అధ్యయ నం సాగుతున్నదని, నివేదిక అందగానే ఈ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. ఆధార్ ఉంటేనే రేషన్ పంపిణీ అనేది తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా డీలర్లు ఇలా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. బోగస్ కార్డులను స్వచ్ఛందంగా స్వాధీనం చేయాలని రేషన్ డీలర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. ఆగస్టు 15 వరకూ దీనికి గడువు ఇచ్చామని వివరించారు. బోగస్కార్డులపై ఎవరైనా సమాచారమిస్తే వారికి పారితోషికం ఇస్తామన్నారు.
ధనిక వర్గాలకు వంటగ్యాస్ సబ్సిడీ ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించిందని.. ఆ ప్రకారం ప్రతి సిలెండర్పై రాష్ట్రం భరించే రూ.25 కూడా తీసేస్తామని ఆయన చెప్పారు. ఒక్కో గ్యాస్ సిలిండర్పై కేంద్రం రూ. 261 సబ్సిడీ భరిస్తోందని, ధనికవర్గాలకు ఈ సబ్సిడీని రద్దు చేయడం వల్ల పేదలకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. నగదు బదిలీ పథకాన్ని తొలుత మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. కిరోసిన్పై కేంద్రం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ పథకంలో భాగంగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారని వివరించారు. సెప్టెంబర్ నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. ఆధార్ జారీ ప్రక్రియ తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది డిసెంబర్కు పూర్తికావాల్సి ఉందని.. అయితే ఇందులో జరిగిన ఆలస్యం వల్ల ఇంకో ఏడాదిన్నర పట్టే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, కిరోసిన్, వంటగ్యాస్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ. 10 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నాయని చెప్పారు. బియ్యం సేకరణకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని, దీనివల్ల బియ్యం ధరలు కూడా తగ్గడంతో పాటు నాణ్యమైన బియ్యం మనకే ఉంటాయని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో ధాన్యా న్ని సేకరిస్తామని, ఇందుకోసం కేంద్రం అనుమతి కోరుతున్నామని చెప్పారు. నెల్లూరు సన్నాల సాగును మరింత ప్రోత్సహిస్తామని, ఈ దిశగా రైతులకు కనీస మద్దతు ధర రూ.1280కి రూ.220 బోనస్ కలిపి రూ.1500 చెల్లిస్తామని వివరించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more