ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , బీఎస్పీ అధినేత్రి మాయావతిపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాయావతిపై సీబీఐ ఎఫ్ఐఆర్ ను కోర్టు తోసిపుచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టివేసింది. ఈ కేసులో దర్యాప్తు చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సీబీఐ తమ ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోకుండా దర్యాప్తు చేపట్టిందని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజ్ కారిడార్ కుంభకోణం మినహాయించి మరే ఇతర అంశాలను పరిగణించబోమని జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మాయావతిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో అక్రమాస్తుల కేసులో తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని కోరుతూ మాయావతి 2008 మేలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై అక్రమాస్తుల కేసు బనాయించారని ఆమె వాదించారు. తన ఆదాయ మార్గం సక్రమమేనంటూ ఆదాయం పన్ను ట్రిబ్యునల్ వెలువరించిన ఆర్డర్ ను పరిగణనలోతి తీసుకోవాలని ఆ ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు కూడా సమర్ధించిందని మాయావతి సుప్రీంకోర్టుకు తెలిపారు.పార్టీ కార్యకర్తలను నుంచి డబ్బు విరాళంగా పొందినట్టు మాయావతి తెలిపారు. మాయావతి ప్రకటించిన ఆస్తుల విలువ 2003లో కోటి రూపాయలు కాగా 2007 నాటికి అది 50కోట్లకు పెరిగిందని సీబీఐ చెప్పింది. ఈ కేసును విచారించిన జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోి సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తూ మే 1న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించిన బెంచ్ అక్రమాస్తుల కేసులో మాయావతికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని చెబుతూ కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై మాయావతి హర్షం వ్యక్తం చేసారు. సీబీఐ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని కోర్టులో తనకు న్యాయం జరిగిదని మాయవతి పేర్కొన్నారు. తనకు సహకరించిన వారందరికీ మాయావతి ధన్యవాదాలు తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more