స్పెక్ట్రమ్ కేటాయింపులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం సారథ్యం వహించనున్నారు. మంత్రుల బృంద సారథ్య బాధ్యతలనుంచి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రాజీనామా చేయడంతో మంత్రుల కమిటీని శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యేదీ ప్రకటించకపోయినా, జాబితాలో చిదంబరం పేరు అగ్రస్థానంలో ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల కమిటీ జాబితాలో సభ్యుడిగా కూడా శరద్ పవార్ పేరు లేకపోవడం గమనార్హం. తరచూ తనను వివాదాల్లోకి లాగుతున్నారనే ఆరోపణతో చైర్మన్ పదవికి శరద్పవార్ రాజీనామా చేసిన విషయం విదితమే. కాగా, పునర్ వ్యవస్థీకరించిన మంత్రుల కమిటీ ఎప్పుడు సమావేశమయ్యేది ఇంతవరకూ ఖరారు కాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పునర్ వ్యవస్థీకరించిన మంత్రుల కమిటీలో రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ, టెలికం మంత్రి కపిల్ సిబాల్, సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అంబికాసోనీ, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మాంటెక్సింగ్ అహ్లూవాలియా సభ్యులుగా కొనసాగనున్నారు.
మంత్రుల కమిటీ చైర్మన్గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి అభ్యర్థిగా పోటీచేయనుండటంతో వారం క్రితం ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత పునర్ వ్యవస్థీకరణకు నోచుకున్న మంత్రుల కమిటీకి శరద్పవార్ను చైర్మన్గా నియమించారు. పవార్ నాయకత్వంలో కమిటీ జూలై 2న సమావేశం కావాల్సి వుంది. అయితే, సమావేశాన్ని వాయిదా వేసిన పవార్ ఈలోగానే ప్రధాని మన్మోహన్కు రాజీనామా లేఖ సమర్పించడంతో మళ్లీ పునర్ వ్యవస్థీకరించాల్సి వచ్చింది.టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలానికి కనిష్ఠ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీని ఏర్పాటుచేశారు. 2008లో అప్పటి టెలికం శాఖ మంత్రి ఎ.రాజా హయాంలో జారీచేసిన 122 లైసెన్సులను గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దుచేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలాన్ని ఆగస్టు 31లోగా పూర్తిచేయాలని కూడా అప్పట్లో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more