వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావన లేని తొలి సభను టిడిపి విజయవంతంగా నిర్వహించింది. గత కొంత కాలంగా టిడిపి రైతు ధర్నా అయినా ఎన్టీఆర్ భవన్లో విలేఖరుల సమావేశం అయినా, శిక్షణా కార్యక్రమం అయినా పేరు ఏదైనా ప్రధానంగా జగన్ గురించే మాట్లాడేవారు. ఉప ఎన్నికల వరకు ఇదే తంతు సాగింది. అయితే ఉప ఎన్నికల ఫలితాల తరువాత హఠాత్తుగా తమ వ్యూహం మార్చేశారు. తాము జగన్ గురించి పదే పదే మాట్లాడటం, అతిగా విమర్శలు చేయడం వల్ల అతను రాజకీయాల్లో ఎదిగిపోతున్నాడని, ఇలాంటి విమర్శల వల్ల చివరకు నష్టం మనకే జరుగుతుంది అని టిడిపి నాయకత్వం భావిస్తోంది. సమీక్షా సమావేశాల్లో ఇదే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఇకపై ప్రజల సమస్యలు ప్రధానంగా రైతుల సమస్యలపై ఉద్యమించాలని, జగన్ను పెద్దగా పట్టించుకోనట్టుగానే ఉండాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన టిడిపి తొలి ధర్నాలో దీన్ని బాగానే అమలు చేశారు. జగన్, కెసిఆర్లపై విమర్శలకే పరిమితమయ్యే టిడిపి నాయకుల ఉపన్యాసాల్లో వారి ప్రస్తావనే లేకుండా నిర్వహించారు. ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాకు చంద్రబాబు ఉదయం 12గంటలకు వచ్చారు. ఒంటి గంటకు అరగంట పాటు ఉపన్యసించారు. రైతుల గురించి గతంలో చెప్పిన విషయాలే చెప్పినప్పటికీ ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. ఇతర నాయకులు సైతం తమ ఉపన్యాసాల్లో జగన్ పేరు పేర్కొనలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more